యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. కెరియర్ మొదట్లోనే కత్తులతో ఆడుకుని రికార్డులను సైతం ఏర్పరచిన యంగ్ టైగర్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత త్రివిక్రం సినిమాతో మళ్లీ సీమ నేపథ్యంతో సినిమా చేస్తున్నాడట.


ఆది, సింహాద్రి, సాంబా సినిమాలతో మాస్ ఇమేజ్ సంపాదించిన ఎన్.టి.ఆర్ అదే తరహా సినిమాలు చేయడంతో బోర్ కొట్టించేశాడు. అయితే కెరియర్ లో కాస్త వెనుకపడినట్టు అనిపించగా ప్రయోగాత్మక సినిమాలు చేసి మళ్లీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. టెంపర్ నుండి వరుస సినిమాలు చేస్తున్న ఎన్.టి.ఆర్ లాస్ట్ ఇయర్ జై లవ కుశతో హిట్ అందుకున్నాడు.


ఇక త్రివిక్రం సినిమాతో రాయలసీమ నేపథ్యంతో వస్తున్నాడట. దీనికోసం రాయలసీమకు సంబందించిన సెట్ కూడా వేశారని తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె, శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


చాలా రోజుల తర్వాత ఎన్.టి.ఆర్ లోని మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు త్రివిక్రం. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రం నూతనోత్సాహంతో చేస్తున్న సినిమా ఇది. వీలైనంతవరకు ఈ సినిమా దసరాకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ రాజమౌళి సినిమా చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: