సుకుమార్ దర్శకత్వం వహించిన ‘రంగస్థలం’ మూవీకి ఆ సినిమా క్లైమాక్స్ అత్యంత కీలకం. అయితే ఆ క్లైమాక్స్ ఒక కొరియన్ సినిమాలోని సన్నివేశాలను గుర్తుకు చేస్తోంది అంటూ కొందరు విమర్శలు కూడ చేసారు. అయితే ఇప్పుడు అదే క్లైమాక్స్ ట్విస్ట్ ను ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న నాని నాగార్జునలు నటిస్తున్న మల్టీ స్టారర్ విషయంలో కూడ ఫాలో అవుతున్నట్లు టాక్. 
సంబంధిత చిత్రం
శతృవు జబ్బుపడితే హీరో కాపాడి ఆతరువాత పగతీర్చుకోవడం ‘రంగస్థలం’ క్లైమాక్స్ ను పీక్ కు తీసుకువెళ్ళింది. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న నాగార్జున నానీల మల్టీ స్టారర్ కథ విషయంలో కూడ ‘రంగస్థలం’ ప్రభావం ఉంది అని వార్తలు వస్తున్నాయి. 
NANI ALONG WITH NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈసినిమాలో నాని డాక్టర్ గా కనిపిస్తాడట. నానీ నాగార్జునలు ప్రాణ స్నేహితులు అయిన నేపధ్యంలో నాగార్జున క్రిటికల్ కండిషన్ లో ఉన్న ఒక పేషంట్ ను తీసుకు వచ్చి నాని హాస్పటల్ లో జాయిన్ చేసి అతడు కోలుకున్న తరువాత ఆవ్యక్తిని చంపడానికి నాగార్జున ప్రయత్నిస్తాడట. 
NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే నాగార్జునకు ఆవ్యక్తి పై ఉన్న పగ ఏమిటి అన్న సస్పెన్స్ చుట్టూ ఈకథ అల్లపడింది అని సమాచారం. ఈసీన్స్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ లోని సారధీ స్టూడియోస్ లో ఒక ప్రత్యేకమైన హాస్పటల్ సెట్ ను వేసి నాగార్జున నానీల పై ఇప్పుడు ఈ కీలక దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనుకోకుండా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మనసులోంచి వచ్చిన ఈ పాయింట్ ‘రంగస్థలం’ మూవీ క్లైమాక్స్ ను పోలి ఉండటంతో ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: