బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సాహూ’. బాహుబలి, బాహుబలి 2 సినిమాల కోసం దాదాపు ఐదు సంవత్సరాలు ఏ సినిమాలు చేయని ప్రభాస్ ఆ సినిమాల విజయం తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే ఈ సినిమా విజయాన్ని కొంత కాలం ఆస్వాదించిన తర్వాత తన స్నేహితుడైన సుజిత్ తో ‘సాహూ’ సినిమాలో నటిస్తున్నాడు.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రభాస్ కి మంచి మార్కెట్ ఉండటంతో సినిమా బడ్జెట్ కూడా భారీగానే వచ్చించారు. దీంతో ప్రభాస్ తరువాత సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.అదేవిధాంగా అతని సినిమాలకు డిమాండ్ కూడా పెరిగింది.’సాహో’ హింది రైట్స్కు మంచి రేటు వచ్చిందని సమాచారం.హింది మార్కెట్కు అనుగుణంగా హింది నటులను ఎక్కువుగా తీసుకున్నారు.
సినిమాలో ప్రధాన పాత్రల్లో ఎక్కువ మంది బాలీవుడ్ నటులే ఉన్నారు. ప్రతినాయకుడిగా నీల్నితిన్ ముఖేశ్ నటిస్తుండగా జాకీ ష్రాఫ్, మందిరా బేడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమాలో మరో బాలీవుడ్ భామ ఎవ్లిన్ శర్మ వచ్చారు.
‘యారియా’, ‘కుచ్ కుచ్ లోచా హై’, ‘యే జవానీ హై దివానీ’ చిత్రాల్లో ఎవ్లిన్ నటించారు. సాహోలో తన పాత్ర కోసం ఎవ్లిన్ పది కిలోలు తగ్గారట. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘రన్ రాజా రన్ ఫేమ్’ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.తెలుగులో ఇంతవరకు రాని యాక్షన్ అడ్వెంచరస్గా ఈ చిత్రం రానుందని సమాచారం.