మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్.  ‘ముకుంద’ సినిమాతో మంచి విజయం అందుకున్న వరుణ్ తేజ్..ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు.   ఫిదా, తొలిప్రేమ సినిమాలో వరుస విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం మరో సినిమా చేయబోతున్నారు.  రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే..త్వరలో అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య..నా ఇళ్లు ఇండియా’ కూడా రిలీజ్ కాబోతుంది. 

ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.  ప్రస్తుతం మెగా హీరోలు విజయ పరంపర కొనసాగిస్తున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ చేస్తున్న కొత్త సినిమా పై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. వరుణ్ సినిమాకు  'ఘాజీ' దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈ రోజున నిర్వహించారు.

దర్శక నిర్మాతలతో పాటు .. కథానాయికలు లావణ్య త్రిపాఠి .. అదితీరావు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో స్పేస్ సెంటర్ సెట్ వేసి .. చాలావరకూ అక్కడే షూటింగ్ జరపనున్నారు. తెలుగులో ఇంతవరకూ అంతరిక్షం నేపథ్యంలో సినిమా రాలేదు. తొలిసారిగా ఈ సినిమా ఆ నేపథ్యంతో రూపొందుతుండటం విశేషం. ఈ సినిమా కోసం లీడ్ యాక్టర్స్‌ కొద్ది రోజులుగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: