సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మేనియా ఓ రేంజ్‌లో ఉంది. థియేట‌ర్ల వ‌ద్ద గురువారం అర్ధ‌రాత్రి నుంచే మ‌హేష్ అభిమానులు అలంక‌ర‌ణ‌లు చేస్తూ, డీజే సౌండ్‌ల‌తో డ్యాన్సులు చేస్తూ నానా ర‌చ్చ ర‌చ్చ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేశారు. అమెరికాలోనే ఏకంగా 2 వేల ప్రీమియ‌ర్ షోలు ప్లాన్ చేశారు.

Image result for bharath ane nanu

ఇక బెంగ‌ళూరులో తొలి ఆట ఉద‌యం 5.30 గంట‌ల‌కు స్టార్ట్ అయ్యింది. ఏపీలో అన్ని చోట్లా 5 గంట‌ల‌కు షోలు స్టార్ట్ అయ్యాయి. ఏపీ ప్ర‌భుత్వం ఈ నెల 27 వ‌ర‌కు ఐదో ఆట‌కు అనుమ‌తి ఇస్తూ అధికారికంగా ఉత్త‌ర్వులు ఇవ్వ‌డంతో కోస్తా, సీడెడ్, ఉత్త‌రాంధ్ర‌లో మ‌హేష్ అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేవు. ప్ర‌తి ఏరియాలోనూ మాగ్జిమం ఉన్న అన్ని థియేట‌ర్ల‌లోనూ తొలి రోజు భ‌ర‌త్ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 

Image result for bharath ane nanu

ఇక అన్ని న్యూస్ ఛానెల్స్‌తో పాటు ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో ప్ర‌తి ఐదారు నిమిషాల‌కు భ‌ర‌త్ యాడ్లు డిస్ ప్లే అవుతున్నాయి. ఇక జంట న‌గ‌రాల్లోనే 300కు పైగా హోర్డింగులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ప్ర‌చారానికే నిర్మాత దాన‌య్య రూ.3 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇక చాలా ప్ర‌ముఖ కార్పొరేట్ కంపెనీలు కూడా ఉచితంగా హోర్డింగులు ఇవ్వ‌డంతో ప్ర‌చారం హోరెత్తుతోంది. 
Related image
శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ – మహేష్ కాంబినేషన్లో వ‌స్తోన్న భ‌ర‌త్‌  టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తుందని , కొత్త రికార్డ్స్ కు భరత్ దారి తీయబోతున్నాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మాణం లో నిర్మితమైన ఈ మూవీ లో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: