సూపర్స్టార్ మహేష్బాబు - కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను తొలి రోజు బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడేసింది. సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ రావడంతో పాటు ముందునుంచే మంచి బజ్ ఉండడంతో భరత్ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. గుంటూరు, కృష్ణాలో నాన్ బాహుబలి 2 రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక తెలుగు సినిమాకు కీలకమైన నైజాం ఏరియాలో కూడా మంచి ప్రదర్శన కనబర్చి మొదటిరోజు సుమారు రూ.4.5 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.
ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి రోజు రూ 21.88 కోట్ల షేర్ రాబట్టింది. మహేష్బాబు కెరీర్లోనే ఫస్ట్ టైం సీఎంగా నటించడంతో సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఆసక్తితో భారీగా అడ్వాన్స్ బుకింగ్లు జరిగాయి. ఇక సినిమాకు మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వీరంగం ఆడేసింది. ఫస్ట్ డే ఈ సినిమా ఏరియా వైజ్ షేర్ డీటైల్స్ ఇలా ఉన్నాయి.
' భరత్ అనే నేను ' ఏరియా వైజ్ ఫస్ట్ డే షేర్ (రూ.కోట్లలో)
నైజాం - 4.47
సీడెడ్ - 2.61
నెల్లూరు - 0.89
కృష్ణ - 1.93
గుంటూరు - 4.04
వైజాగ్ - 2.91
ఈస్ట్ - 3.21
వెస్ట్ - 1.82
--------------------------------------
ఏపీ + తెలంగాణ = 21.88 కోట్లు
--------------------------------------