బుల్లితెరపై వస్తున్న 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది నటులు వెండి తెరకు పరిచయం అయ్యారు. యాంకర్ అనసూయ ఈ మద్య రంగస్థలం లో రంగమ్మత్తగా మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక రష్మి అయితే పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. 'జబర్దస్త్' తో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో కమెడియన్లు తమ సత్తా చాటుతున్నారు.
తాజాగా 'జబర్దస్త్' పాపులారిటీ తెచ్చుకున్న నటుడు మహేష్. శతమానం భవతి' సినిమాతో తెరపై సందడి చేసిన ఆయన, 'రంగస్థలం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మద్య ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ..'రంగస్థలం' సినిమాతో మంచి పేరు వచ్చింది. "ఈ సినిమా తరువాత సుకుమార్ గారికి మహేశ్ బాబుగారు కాల్ చేసినప్పుడు నా గురించి అడిగారట. 'ఆ కుర్రాడు బాగా చేశాడు .. మీతో పాటు ఒకసారి తీసుకురండి' అన్నారట. అలాగే ఈ సినిమా నిర్మాతలు మహేశ్ బాబు గారిని కలిసినప్పుడు కూడా, ఆయన మళ్లీ నా విషయాన్ని గురించి ప్రస్తావించారట.
ఇక మహానటి చిత్రంలో కూడా తాను నటించానని..ఆ సినిమాలో అద్భుతమైన పాత్ర తనకు లభించిందని ఈ పాత్ర తో మరోసారి మంచి క్రేజ్ వస్తుందని అన్నారు. ఆ పాత్రను గురించి నేను ఇప్పుడు చెప్పకూడదు .. అదేమిటనేది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఈ పాత్ర నాకు మరింత మంచి పేరు తెస్తుందనే నమ్మకమైతే వుంది. ప్రస్తుతం నితిన్ 'శ్రీనివాస కల్యాణం'తో పాటు, రామ్ .. శర్వానంద్ సినిమాల్లో కూడా చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.