తెలుగు ఇండస్ట్రీలో బిగ్ బాస్ షో తర్వాత జనాలకు పరిచయం అయ్యారు..సినీ విశ్లేషకులు కత్తి మహేష్. ఆ తర్వాత ఒక్కనైట్ పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఒక్కదెబ్బతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. నాలుగు నెలలు పవన్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి మహేష్ కి మద్య ఎన్నో వివాదాలు నడిచాయి. ఎన్నో సార్లు కత్తి ఛానల్స్ ముందు తన గోస వినిపించాడు. ఇదిలా ఉంటే ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి వస్తున్న సమయంలో కోడిగుడ్ల దాడి జరిగింది.
అందులో జనసేన కార్యకర్తలు ఉన్నారని తెలుసుకొని పోలీస్ కేసు పెట్టడానికి వెళ్లి అనూహ్యంగా పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలతో ఫోటో తీసుకొని ఆ వివాదానికి స్వస్త పలికారు. ఇదిలా ఉంటే కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై చేసిన వ్యాఖ్యలకు మరోసారి పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మరుసటి రోజు నుంచి శ్రీరెడ్డిపై యూట్యూబ్స్ ఛానల్స్ లో దుమ్మెత్తి పోశారు. ఈ విషయంపై పవన్ కళ్యాన్ నిన్న ఫిలిం ఛాంబర్ కి రావడం జరిగింది.
అసలే ఆగ్రహంతో ఉన్న పవన్ ఫ్యాన్స్ హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ వద్ద ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ వాహనాలను ధ్వంసం చేశారు. దాంతో పవన్ కల్యాణ్ అభిమానులను బంజారా హిల్స్ పోలీసులు ఈరోజు అ రెస్టు చేశారు. కాగా, దీనిపై ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ స్పందిస్తూ చేసిన ట్వీట్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతి స్పందించారు.
‘పవన్ కల్యాణ్ మీ ఫ్యాన్స్ కు హెల్ప్ చేయి.. ఈసారి పారిపోవద్దు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాహనాలను ధ్వంసం చేయడంతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. జేఎస్పీ లీడర్, నటుడు పవన్ కల్యాణ్ కు అభిమానులమని వారు చెబుతున్నారు. నిందితులను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే కత్తి మహేష్ ట్విట్ పై వెంటనే స్పందించిన వర్మ ‘ఎస్.. మీరు చెప్పింది కరెక్టు.. ఫిల్మ్ చాంబర్ కు ఏవిధంగా అయితే అతను వెళ్లారో, అదే విధంగా ‘మెగా’ కుటుంబంతో కలిసి అతను పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారికి మద్దతుగా నిలవాలి’ అని పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించకుండా వర్మ పరోక్షంగా సలహా ఇచ్చారు. మొత్తానకి ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదని..సోషల్ మాద్యమాల ద్వారా ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ..జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారని కొంత మంది అంటున్నారు.