టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ విశ్లేషకుడిగా కెరీర్ మొదలు పెట్టి ఓ సినిమాకు దర్శకత్వం వహించి ‘బిగ్ బాస్ ’రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కత్తి మహేష్. బిగ్ బాస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ పై ఫేస్ బుక్ లో సంచలన కామెంట్ చేయడంతో మరుసటి రోజు నుంచి పవన్ ఫ్యాన్స్ యూట్యూబ్ లో, సోషల్ మాద్యమాల్లో దుమ్మురేపాడు. అయితే కత్తి మహేష్ కూడా ఎక్కడా తగ్గకుండా పవన్ ఫ్యాన్స్ కి ధీటుగా సమాధానం ఇస్తూ వచ్చారు.
ఆ మద్య కత్తిపై కోడిగుడ్ల దాడి జరగడంతో..ఈ కథ మరో మలుపు తిరిగింది. అనూహ్యంగా కత్తి మహేష్ జనసేన కార్యక్తలతో ఓ సెల్ఫీ దిగి..ఈ ఎపిసోడ్ కి పులిస్టాప్ పెట్టినట్లు చేశారు. కానీ ఈ మద్య మళ్లీ తెరపైకి వచ్చారు..కత్తి మహేష్. ప్రతిరోజూ పవన్ పై, ఫ్యాన్స్ పై రక రకాల ట్విట్స్ పెడుతూ సంచలనం రేపుతున్నాడు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ని విమర్శించేందుకు తనకు స్థాయి లేదు అన్న పవన్ ఫ్యాన్స్ విమర్శలపై ఘాటుగా స్పందించారు కత్తి మహేష్. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ తన స్థాయిని ప్రశ్నించిన వారికి గట్టిగా సమాధానమిచ్చారు.‘‘పవన్కు ఏం స్థాయి ఉంది? ఫ్యాన్స్ స్థాయి గురించి ప్రశ్నించకూడదు. స్థాయి గురించి ప్రశ్నించొద్దు.
ఏమనుకుంటున్నారసలు. నా స్థాయి గురించి ప్రశ్నించేంత సీన్ ఉందా? పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కి. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితేనే పవన్ కల్యాణ్ని రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువగా మాట్లాడకండి. మొదటి నుంచి చెప్పాను. ఏంటి పవన్ స్థాయి? ఆయన 12వ తరగతి ఫెయిల్.. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని. పవన్ పెద్ద కాపు నేను మాదిగ. ఇదేనా స్థాయి? స్థాయి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే బాగుండదు.
మర్యాద ఉండదు అని చెప్తున్నా పవన్ ఫ్యాన్స్కి. పవన్ కల్యాణ్ బీ కేర్ ఫుల్. నాతో స్థాయి గురించి మాట్లాడకండి’’ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై లేపిన దుమారం ఇప్పుడు మెగా ఫ్యామిలీ వర్సెస్ మీడియా ఛానల్స్ కి చేరింది. సందిట్లో సడేమియాలా శ్రీరెడ్డి, కత్తి మహేష్, రాంగోపాల్ వర్మ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ని టార్గెట్ చేసుకున్నారు.