మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ప్రస్తుతం అందరి మనసులను టచ్ చేస్తుంది. సమజానికి మంచి చేసే ఇలాంటి సిఎం ఉంటే బాగుండని అనిపిస్తుంది. కొరటాల శివ రచన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చూసిన రాజమౌళి మొదటి రోజే ట్వీట్ చేయగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లిన ఎన్.టి.ఆర్ స్పెషల్ గా ట్వీట్ చేశాడు.


సామాజిక బాధ్యతను కమర్షియల్ ఎలిమెంట్స్ లో ఇనుమడింపచేసిన దర్శకుడు కొరటాల శివ ప్రతిభకు కుదూస్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మహేష్ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతమని అన్నారు ఎన్.టి.ఆర్. సినిమా విజయం సాధించినందుకు భరత్ అనే నేను చిత్రయూనిట్ అందరికి కంగ్రాట్స్ చెబుతూ ఇదో నిజాయితి కలిగిన ఎలాంటి రిమాక్స్ లేని సినిమా అని ట్వీట్ చేశారు.


భరత్ అనే నేను సినిమాకు ఎన్.టి.ఆర్ కు సంబంధం ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎలాంటి ఆలోచన లేకుండా వెళ్లి బెస్ట్ విష్ చెప్పివచ్చాడు ఎన్.టి.ఆర్. అంతేకాదు మహేష్ అన్నా అంటూ తన గొప్పతనం గురించి ప్రస్థావించాడు. అందుకే భరత్ విజయం ఎన్.టి.ఆర్ కు ఆనందాన్ని ఇచ్చినదని చెప్పొచ్చు. 


ప్రస్తుతం ఎన్.టి.ఆర్ త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ సినిమా అక్టోబర్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ రాజమౌళి మెగా మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. అందుకోసమే తారక్ తన లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.



మరింత సమాచారం తెలుసుకోండి: