టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా మంది హీరో హీరోయిన్లు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ మద్య అక్కినేని అబ్బాయి నాగ చైతన్య..అందాల తార సమంత ‘ఏం మాయ చేసావే’సినిమాలో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అక్కినేని నాగార్జన సైతం ‘శివ’సినిమాలో తన జంటగా నటించిన అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా చెలామణి అవుతున్న మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేనూ’మొన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయన అన్ని కేంద్రాల్లో పాజిటీవ్ టాక్ రావడం..మొదటి రోజే సూపర్ కలెక్షన్లు సాధించడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షంతో దూసుకుపోతుండడంతో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు.
శ్రీమంతుడు సినిమా తర్వాత ‘బ్రహ్మోత్సవం’,‘స్పైడర్’ భారీ డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న మహేష్ కి ఆ ఆనందమైన రోజు వచ్చినపుడు ఎంత పరవశించి పోతారో వేరేగా చెప్పాలా..! ఆ ఆనందాన్ని ఎంతో ఇష్టమైన వారితో పంచుకుంటే అది రెట్టింపవుతుంది. అందుకే.. తన సతీమణి నమ్రతా శిరోద్కర్కు ప్రేమ పూర్వకంగా ముద్దు పెట్టి మరీ.. తన ఆనందాన్ని ఆమెతో కలిసి పంచుకున్నారు ప్రిన్స్.
దీనికి సంబంధించిన పిక్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. ‘థాంక్యూ మై లవ్’ అంటూ భార్యకు కృతజ్ఞతలు కూడా తెలిపారు మహేశ్. ప్రస్తుతం ఈ గాఢమైన ముద్దు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత రెండు సంవత్సరాలుగా మహేశ్ ప్రొఫెషనల్, పర్సనల్ రిలేషన్స్ను నమ్రతా చూస్తున్న విషయం తెలిసిందే.