టాప్ హీరో టాప్ డైరెక్టర్ కాంబినేషన్ కుదిరి సినిమా కధ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్స్ వద్దకు వస్తున్నారు. ఈ సమ్మర్ రేస్ కు వచ్చిన చరణ్ మహేష్ ల మూవీలు సూపర్ హిట్ అవడంతో ఇక ఇప్పుడు అందరి దృష్టి ఈ సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ మరో 12రోజులలో రాబోతున్న అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ పై ఉంది. చరణ్ మహేష్ ల సినిమాలు హిట్ అవ్వడమే కాకుండా వారు తదుపరి వెంటనే నటించే సినిమాల పై కూడ క్లారిటీ వచ్చేసింది.
ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతున్నాడు
చరణ్ బోయపాటి మూవీ సెట్స్ పైకి వెళ్లి జాయిన్ అయితే అతి త్వరలోనే మహేష్ వంశీ పైడి పల్లి దర్శకత్యం వహించబోయే సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే అల్లుఅర్జున్ ‘నాపేరు సూర్య’ రిజల్ట్ వచ్చాక ఎన్ని నెలలకు మరో సినిమాను ప్రారంభిస్తాడు అనే విషయం పై ఇప్పటికే ఒక క్లారిటీ లేక పోవడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. 
ఇది చాలా చాలా పెద్ద తప్పు, నాకు నచ్చలేదు
వాస్తవానికి  మైత్రీ మూవీస్ సుకుమార్ కాంబినేషన్ ను అల్లుఅర్జున్ ఎందుకు మిస్ చేసుకున్నాడు అన్న విషయం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ అందరు బిజీగా ఉన్నారు. మరో వైపు మహేష్ వంశీ పైడిపల్లితో చేస్తున్న సినిమా తరువాత చేయబోయే సినిమా పై కూడా క్లారిటీ వచ్చేసింది. దీనికితోడు ప్రతి టాప్ హీరో రెండు మూడు సినిమాలు సెట్ చేసుకుని రెడీ అవుతూ ఉంటే బన్నీ మాత్రం ఒక్క సినిమా కూడా సెట్ చేసుకోకుండా ‘నాపేరు సూర్య’ తరువాత ఖాళీగా ఉండటం ఎవరికీ అంతు పట్టని విషయంగా మారింది. 
ఎండ్ ఆఫ్ ది డే మేము అంతా ఒకటే...
ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం అల్లుఅర్జున్ కొరటాల శివ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొరటాల మాత్రం తన మనసులో మాట బయటపెట్టకుండా ప్రస్తుతం ‘భరత్’ సక్సస్స్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా నిన్న బన్ని మాధవరంలో జరిగిన ‘నాపేరు సూర్య’ ఆడియో ఫంక్షన్ లో పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ చెప్పిన ‘అగ్గిపుల్ల పెట్రోల్ ట్యాంక్’ కధలో శ్రీరెడ్డిన అగ్గిపుల్ల అయితే మీడియాను పెట్రోల్ ట్యాంకర్ తో అల్లు అర్జున్ పోల్చాడా ? అంటూ కొందరు అల్లు అర్జున్ కామెంట్స్ పై సెటైర్లు వేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: