టాలీవుడ్ లో నాగశౌర్య నటించిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.  ‘అంజలి’ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన షామిలి ఎన్నో అవార్డులు గెల్చుకుంది.  బాలనటిగా నటించిన షాలిని ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యారు..ఆ తర్వాత సిద్దార్థ నటించిన ‘ఓయ్’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.  ఆ సినిమాల షాలిని కాస్త బొద్దుగా కనిపించింది..తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు.  తాజాగా  నాగ‌శౌర్య‌, షామిలి జంట‌గా న‌టించిన చిత్రం 'అమ్మ‌మ్మ‌గారిల్లు'. సుమిత్ర ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకి సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

స్వాజిత్ మూవీస్ ప‌తాకంపై రాజేష్ నిర్మించిన ఈ చిత్రం మే నెల‌లో తెర‌పైకి రానుంది. నిన్న రిలీజ్ అయిన `అమ్మ‌మ్మ‌గారిల్లు`  టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘తొలిసారి చ‌క్క‌ని కుటుంబ క‌థా చిత్రంలో న‌టిస్తున్నా. షూటింగ్ చేస్తున్నంత‌ సేపు సెట్‌లో పండ‌గ వాతావార‌ణంలా కోలాహలంగా ఉంది. కుటుంబ అనుబంధాలు.. ఆప్యాయ‌త‌లు.. అనురాగాలు.. అందులో వ‌చ్చే చిన్న చిన్న మ‌నస్ప‌ర్ధ‌లు.. ఆవేద‌న ఎలా ఉంటుంద‌నేది ద‌ర్శకుడు చ‌క్క‌గా తెర‌కెక్కించాడు.క‌థ‌ను న‌మ్మి సినిమా చేశాం. నిర్మాణ విలువ‌లు ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఉంటాయని అన్నారు. 

హీరోయిన్ షామిలి మాట్లాడుతూ.. ‘ఓయ్’ సినిమా త‌ర్వాత స‌రైన క‌థ కుద‌ర‌క‌పోవ‌డంతోనే మ‌రో సినిమా చేయ‌లేదు. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ ‘అమ్మమ్మ‌గారిల్లు’ క‌థ న‌చ్చ‌డంతో సినిమాకు వెంట‌నే ఒప్పుకున్నాను. నా క్యారెక్ట‌రైజేష‌న్ చాలా కొత్త‌గా ఉంటుంది. నాగ‌శౌర్యతో సినిమా చేయ‌డం సంతోషంగా ఉందని అన్నారు. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. కాగా ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: