రాజమౌళి జూనియర్ చరణ్ లతో నిర్మిస్తున్న మల్టీ స్టారర్ కథకు సంబంధించి ఇప్పటికే అనేక లీకులు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ కథ విషయమై రాజమౌళి అత్యంత రహస్యాన్ని కొనసాగిస్తూ ఉన్నా ఈ మూవీ కథకు సంబంధించి ఎదోఒక ఫ్లాష్ మీడియాలో కనిపిస్తూ ఉండటం సర్వసాధారణంగా మారిపోయింది.
RAJAMOULI MULTISTARRER WITH RAM CHARAN AND JUNIOR కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో అక్టోబర్ నుండి ప్రారంభం కాబోతున్న ఈమూవీకి సంబంధించి మరొక హాట్ న్యూస్ ఇప్పుడు లీక్ అయింది. ఈమూవీ కథ అంతా ఒకేరోజు జరిగినట్లుగా మనకు వెండి తెర మీద కనిపించే విధంగా రాజమౌళి ట్విస్ట్ ఇస్తున్నట్లు సమాచారం. ఈమూవీ కథ ఉదయం ప్రారంభం అయి రాత్రికి క్లైమాక్స్ తో ముగిసిపోతుండట. 
సంబంధిత చిత్రం
సాధారణంగా ఇలాంటి టెక్నిక్స్ తో హాలీవుడ్ లో చాల సినిమాలు వచ్చాయి. మన తెలుగులో కూడ కొందరు దర్శకులు ఈ టెక్నిక్ ను అనుసరిస్తూ ఒకేరోజు ఆసినిమా కథ పూర్తి అయినట్లు భ్రాంతి కలిగించే విధంగా స్క్రీన్ ప్లే వ్రాసి తీసిన సినిమాలు చాల ఉన్నాయి. అయితే అలాంటి ప్రయోగాలు చేసిన దర్శకుల సినిమాలను గతంలో మన తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. 
RAMCHARAN ALONG WITH CHARAN AND JUNIOR PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి మల్టీ స్టారర్ లో ఫస్ట్ హాఫ్ లో చరణ్ చుట్టూ కథ నడిస్తే సెకండ్ హాఫ్ లో జూనియర్ చుట్టూ కథ నడుస్తుందని సమాచారం. దీనినిబట్టి చూస్తుంటే జూనియర్ చరణ్ లు కలిసి నటించే సన్నివేశాలు ఈమూవీ సెకండ్ హాఫ్ లో మాత్రమే వస్తాయి అని అంటున్నారు. 1980 ప్రాంతంలో జరిగిన ఒలింపిక్స్ క్రీడలలో జరిగినట్లుగా చెప్పబడుతున్న ఒక యదార్ధ సంఘటనకు ఈ కథ ప్రాతిపదిక అని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా ఈమూవీలో హీరోయిన్ గా కైరా అద్వానీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈవార్తలే నిజం అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కైరా దశ తిరిగినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: