తెలుగు బుల్లితెరపై ‘జబర్థస్త్’ కామెడీ షో ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే.  భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగు వారందరి మనసు దోచుకుంది  ‘జబర్థస్త్’ కామెడీ షో.  ఒకప్పుడు కృష్ణ నగర్ లో ఒక చిన్న వేషం దొరికతే చాలు అనుకున్న కొంత మంది ఔత్సాహికులు ఇప్పుడు లగ్జరీ జీవితాలు గడిపే స్థాయికి తీసుకు వచ్చింది  ‘జబర్థస్త్’ కామెడీ షో.  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో  ‘జబర్థస్త్’ టీమ్ కమెడియన్లుగా కనిపిస్తున్నారు.  ఇప్పటికే వేణు, ధన్ రాజ్, తాగుబోతు రమేష్, శకలక శంకర్ లు కమెడియన్లు గా సెటిల్ అయ్యారు.
Related image
ఇప్పుడు గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే  శకలక శంకర్ జబర్థస్త్ లోకి రాకముందు శ్రీకాకుళంలో చిన్న చిన్న పనులు చేస్తూ జీవితాన్ని వెల్లబుచ్చేవాడు. ఒకసారి చిరంజీవి నటించిన మంజునాథ చిత్రం చూసిన తర్వాత ఎంతో ప్రభావితుడై సినిమాల్లో నటించించాలన్న కాంక్షతో హైదరాబాద్ కి రావడం అదృష్టం కలిసి వచ్చి జబర్థస్త్ లో చోటు దొరకడం అన్ని జరిగిపోయాయి. 

శకలక శంకర్  పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి పరమ భక్తుడు. ఆయనకు సంబంధించిన స్కిట్స్ కూడా ఎన్నో వేశారు. ఈ మద్య పవన్ పై వస్తున్న వార్తలకు ఆయన ఎంతో ఆవేదన చెందారు..అంతే కాదు శ్రీకాకుళంలో జనసేన పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ‘ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు’ ర్యాలీలో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, మీడియాపై పవన్ అభిమానులు దాడి చేయడం సమర్థనీయమేనని అన్నాడు. 

పవన్ కల్యాణ్ అభిమానులుగా ఆయన చెప్పింది తాము చేస్తామని ‘జబర్దస్త్’ నటుడు షకలక శంకర్ అన్నాడు. విధ్వంసాలకు పవన్ కళ్యాన్ ఎప్పుడూ దూరమే..ఆయన అభిమానులు కూడా ఆయన బాటలోనే నడుస్తారు.  ఒకవేళ చెబితే.. అభిమానులుగా శిరసావహించాలి’ అని చెప్పాడు. ‘ఏబీఎన్’ వాహనాలపై పవన్ అభిమానులు ఇటీవల చేసిన దాడి విషయమై ప్రశ్నించగా, ‘దాడి అందరూ చేస్తారా? ఎవరో కొంత మంది ఉంటారు!’ అని షకలక శంకర్ సమాధానమిచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: