ఈ మద్య సెలబ్రెటీలు ఏం చేసినా అది రచ్చ అవుతుంది. ముఖ్యంగా సోషల్ మాద్యమాలు వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలు తమ అభిప్రాయం తెలపడం..అది కాస్త నెటిజన్లకు నచ్చితే..ఓకే లేదంటే రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా అర్జున్ రెడ్డితో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి మూవీ రూపొందుతున్నది.. ఈ మూవీలో సావిత్రిగా కీర్తీ సురేష్ కనిపించనుంది. ఇదే మూవీలో సమంత జర్నలిస్ట్ గా, ఆమె స్నేహితుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మహానటి సినిమాకి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ వాట్ ఏ కూల్ చిక్ అని కామెంట్ పెట్టాడు. దీనిపై వివాదం నెలకొంది. అయితే మహానటి సావిత్రి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గౌరవిస్తారు..ప్రేమిస్తారు..అలాంటిది మహానటి సావిత్రి పోస్టర్పై చిక్ అనే కామెంట్ పెట్టడంతో నెటిజన్స్ విజయ్ దేవరకొండపై నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.. ఆ పదం వాడి ఆ మహానటిని అవమానించరంటూ విజయ్ ను ఆడుకుంటున్నారు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ నెటిజన్లకు ఘాటుగా సమాధానం ఇచ్చారు.
సావిత్రి అంటే తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారత దేశం ఎంతో ఇష్టపడేవారు..ఆమె చాలా అందంగా ఉండటమే కాదు..అద్భుతమైన హావభావాలతో తన పాత్రకు జీవం పోసేవారు. ఆమెకి కార్లంటే చాలా ఇష్టం. చెన్నైలో ఉన్నప్పుడు ఆమె నివాసంలో ఎన్నో వింటేజ్ కార్లు ఉండేవట. ఆమె దేనికీ..ఎవరికీ భయపడే వారు కాదని..సమాజానికి చాలా మంచి చేశారు. తనని అందరు ప్రేమించాలనుకున్నారు, ప్రేమని పొందాలనుకున్నారు ఆ తర్వాత సూపర్ స్టార్గా అవ్వాలని కలలు కన్నారు.
అంతే కాదు సావిత్రి విషయంలో నన్ను క్షమాపణలు కోరే వారు..చెన్నై లీలా ప్యాలెస్కి వచ్చేయండి. నేను అక్కడే ఉన్నాను..మహానటి ఆడియో లాంచ్ ఎంట్రీలు కూడా ఇస్తాను. ఆమె మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే మీ లాంటి నైతిక విలువలు ఉన్నవాళ్లూ.. నీతిమంతుల బ్యాచ్ అంతా సంసారం నాశనం చేసుకుందని.. తాగుబోతు అని పిలిచారు. మీరు చేసిన కామెంట్లతో పోలిస్తే నేను ‘వాట్ ఏ కూల్ చిక్’ అన్నందుకు ఆమె చాలా సంతోషించి ఉంటారు’’ అని విజయ్ తన ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.