టాలీవుడ్ లో ఈ మద్య నందమూరి కుర్రోళ్లు మంచి హిట్ సినిమాలతో దూసుకు వెళ్తున్నారు.  నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ సినిమా పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. తాజాగా క‌ళ్యాణ్‌రామ్ కెరీర్ 16వ సినిమా నేడు ప్రారంభ‌మైంది. ఈ బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ -రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో NKR16 లాంఛ‌నంగా ప్రారంభంమైంది. దేవుని చిత్ర ప‌టాల‌పై ఎన్టీఆర్ క్లాప్ కొట్టి ఈ సినిమాని ప్రారంభించారు.

ఓ వైపు హీరోగా, మ‌రోవైపు నిర్మాత‌గా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. త‌మ్ముడు ఎన్టీఆర్ అండ‌దండ‌ల‌తో మ‌రింత స్పీడ్ అత‌డిలో క‌నిపిస్తోంది. ఇదివ‌ర‌కు తార‌క్ కెరీర్ బెస్ట్ సినిమా `జై ల‌వ‌కుశ‌`ను నిర్మించింది క‌ళ్యాణ్‌రామ్‌. హీరోగా `ఎంఎల్ఏ`తో హిట్ అందుకున్నాడు. త‌దుప‌రి `నా నువ్వే` రిలీజ్‌కి రానుంది. నంద‌మూరి హ‌రికృష్ణ‌, నంద‌మూరి రామ‌కృష్ణ‌, చిత్ర ద‌ర్శ‌కుడు గుహ‌న్ త‌దిత‌రులు ఈ ఓపెనింగులో పాల్గొన్నారు.

ఈ  సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ స‌ర‌స‌న‌ నివేధ థామ‌స్‌, `అర్జున్‌రెడ్డి` ఫేం షాలిని పాండే క‌ళ్యాణ‌రాముని స‌ర‌స‌న క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.  ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో రెండో సినిమాగా ఈ  సినిమా తెర‌కెక్కుతోంది. దీనికి శేఖ‌ర్ చంద్ర సంగీతం సమకూర్చనున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ  సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగనున్నదట. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: