ఈ మాటలు అంటుంది ఎవరో కాదు అందాల నటి సమంత. ఏం మాయ చేసావే చిత్రం తర్వాత హీరో నాగ చైతన్య ప్రేమలో పడిన తర్వాత ఇరువురు కుటుంబాలను ఒప్పించి గోవాలో రెండు సాంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన తర్వాత సినిమాల్లో నటించరని వార్తలు వచ్చినప్పటికీ ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించింది సమంత. అంతే కాదు త్వరలో ‘మహానటి’ రాబోతుంది..తమిళంలో మరో చిత్రంలో నటిస్తుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..నటనను కూడా ఓ ఉద్యోగమే అనుకోవడం ప్రారంభించిన దగ్గర నుంచి తన జీవితమే మారిపోయిందని వ్యాఖ్యానించింది. మారిన తన ఆలోచన తనకెంతో మేలు చేసిందని పేర్కొంది. వ్యక్తిగత జీవితంతో పాటు నటననూ ఆస్వాదిస్తున్నానని చెప్పింది. ఒక దశలో సినిమాలు మానేద్దామని అనుకున్నానని, అయితే, మంచి కథలు వస్తుండటంతో అలా చేయాల్సిన అవసరం కలగలేదని చెప్పింది.
ఒకప్పుడు హిట్ సినిమాల్లో నటించినా, వాటిని ఆస్వాదించలేని పరిస్థితి నుంచి ఇప్పుడు బయటపడ్డానని వెల్లడించింది. తన సినిమాలకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ తనకెంతో ధైర్యాన్నిస్తోందని చెప్పుకొచ్చింది. తాను నటించిన సినిమాలకు మంచి ఆదరణ లభించడం తన అదృష్టమని..ఇకమీదల నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని అలాంటి పాత్రలే చేస్తానని సమంత అన్నారు.