టాలీవుడ్ లో దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ‘భరత్ అనే నేను’ అలాంటి సూపర్ హిట్ సినిమాతో తెగ సంతోషంలో మునిగిపోయాడు ప్రిన్స్ మహేష్ బాబు.  ఈ సినిమా కు సంబంధించి సక్సెస్ మీట్ లో ఎన్నో విశేషాలు పంచుకున్నాడు.  శ్రీమంతుడు లాంటి మంచి విజయం అందుకున్న తర్వాత బ్రహ్మాత్సవం, స్పైడర్ లాంటి డిజాస్టర్స్ తనను ఎంతగానో కుంగదీశాయని..తర్వాత వచ్చే సినిమా ఎలా ఉంటుందో అని టెన్షల్లో ఉన్న సమయంలో కొరటాల శివ తన సత్తా చాటాడని..‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్ బస్టర్ అందించారని అన్నారు.
Image result for bharath ane nanu
ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సినిమా విజయోత్సవాన్ని ఆస్వాదిస్తున్న మహేష్ బాబు తన తదుపరి సినిమా సుకుమార్ తో చేయాలని నిశ్చయించారు.  ఇదిలా ఉంటే..అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత  ఎన్నో బ్రహ్మాండమైన ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ చిత్ర దర్శకుడు సందప్ వంగా ఇప్పటి దాకా మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. దీనికి కారణం.. మహేష్ బాబు తో తన రెండో చిత్రాన్ని తీయాలని అతడు ప్రయత్నిస్తుండటమే.  సందీప్ తో చేసేందుకు మహేష్ కూడా ఆసక్తి చూపడంతో మైత్రీ మూవీ మేకర్స్‌ అతడికి అడ్వాన్స్ ను కూడా అందచేసింది. 
mythri
అయితే మహేష్ బాబు తన మనసు మార్చుకొని సంపత్ తో సినిమా తీయడానికి వెనుకాడినట్లు తెలుస్తుంది.  ‘రంగస్థలం’ లాంటి సూపర్ హిట్ అందించిన సుకుమార్ తో తన తదుపరి సినిమా తీయడానికి సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. రంగస్థలం చిత్రం విపరీతంగా నచ్చడంతో..సుకుమార్‌తోనే చేయాలని మహేష్ డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం  మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో మహేష్ చాలా కాలం తర్వాత ఓ మాస్‌ క్యారెక్టర్ చేస్తున్నాడు. గమ్యం సినిమాలో అల్లరి నరేష్ చేసిన ‘గాలి శ్రీను’ తరహాలో ఆయన పాత్ర ను వంశీ పైడిపల్లి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.   

దిల్ రాజు- అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ కల్లా పూర్తి చేసి..తదనంతరం సుకుమార్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నాడట.  అయితే భరత్ అనే నేను లాంటి విజయం అందుకున్న మహేష్ బాబుతో తన సినిమా తీయబోతున్నానన్న ఆశలో ఉన్న సందీప్ వంగ తీవ్ర నిరాశకు లోనట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: