సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భారత అనే నేను చిత్రం ఘనవిజయం సాధించింది. కళ్ళు చెదిరే వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని తెగ ఆకట్టుకుంటోంది. కొరటాల శివ సందేశాత్మక చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో మహేష్ బాబు కి మంచి విజయాన్ని అందించారు.  భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్ లోనే బిగ్గెట్ హిట్ గా దూసుకుపోతోంది.
మహేష్ సంతోషం రెట్టింపు
ఈ చిత్ర విజయాన్ని మహేష్ ఎంజాయ్ చేస్తున్నాడు. మహేష్ సంతోషాన్ని ఎన్టీఆర్, రాంచరణ్ రెట్టింపు చేసారు.భరత్ అనే అనే నేను చిత్రంలో అంతా ప్రత్యేకించి మహేష్ బాబు నటన గురించి మాట్లాడుతున్నారు. ఇక ఇండస్ట్రీలో మహేష్ బాబు నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సెలబ్రెటీలు. 
మహేష్ సంతోషాన్ని ఎన్టీఆర్, రాంచరణ్ రెట్టింపు చేసారు.భరత్ అనే అనే నేను చిత్రంలో అంతా ప్రత్యేకించి మహేష్ బాబు నటన గురించి మాట్లాడుతున్నారు. ఎప్పటిలాగే మహేష్ నటనతో అదరగొట్టేసినా , ప్రెస్ మీట్ వంటి కీలక సన్నివేశాల్లో సూపర్ స్టార్ నటన మెస్మరైజ్ చేసింది.

Image result for bharath ane nanu

భారత అనే నేను చిత్రం విజయం సాధించడంతో ఇటీవల చిత్ర యూనిట్ ప్రవేట్ పార్టీ నిర్వహించింది. ఆ పార్టీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా హాజరయ్యారు.  ఈ పార్టీలో ఎన్టీఆర్, చరణ్, మహేష్ కలసి ఫొటోకు ఫోజు ఇచ్చారు. ముగ్గురు టాప్ హీరోలు కలిసున్న ఈ చిత్రాన్ని అటు మహేష్ బాబు భార్య నమ్రత, ఇటు రామ్ చరణ్ భార్య ఉపాసన తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: