తెలుగు బుల్లితెరపై ‘జబర్దస్త్‌ ’ కామెడీ షో కి ఎంత పాపులారిటీ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌ వస్తుందంటే..చాలా టెలివిజన్ ముందు కూర్చుండి పోతారు జనాలు.  అయితే జబర్దస్త్‌  ఎంత పాపులారిటీ సంపాదించిందో అన్ని వివాదాలు కూడా మూటగట్టుకుంది. గతంలో కొన్ని స్కిట్స్ కొంత మంది మనోభావాలు దెబ్బ తీశాయని ఎన్నో ఫిర్యాదులు రావడమే కాదు..ఏకంగా వేణు పై దాడి కూడా చేశారు. తర్వాత లాయర్ల మనోభావాలు దెబ్బతీశారని...ఇలా రక రకాల ఫిర్యాదులు వచ్చాయి.

ఎన్ని ఫిర్యాదులు వచ్చినా..జబర్దస్త్‌ ఉన్న క్రేజ్ తగ్గడం లేదు.  ఇక జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఔత్సాహికులు మంచి జీవితాలు జీవిస్తున్నారు.  ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్లు తమ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇదిలా ఉంటే..టీవీ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్‌ నటులు రైల్వే స్టేషన్‌లో టీసీతో గొడవ పెట్టుకున్న ఘటన విశాఖపట్నం స్టేషన్‌లో చోటు చేసుకుంది.

ముఖ్యంగా జబర్దస్త్‌ షేకింగ్‌ శేషు టీసీతో గట్టిగా మాట్లాడుతూ కెమెరాకు చిక్కాడు. వారంతా విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు జనరల్‌ టికెట్ తీసుకున్నారు.  జనరల్ టికెట్ తీసుకొని థర్డ్‌ క్లాస్‌ ఏసీలో ప్రయాణం చేయడంతో టీసీ అభ్యంతరం చెప్పారు.
Related image
ఈ కారణంగానే టీసీపై జబర్దస్త్‌ నటులు మండిపడి వాగ్వివాదానికి దిగినట్లు తెలిసింది. సదరు నటులపై టీసీ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసి మీడియా అక్కడకు రావడంతో జబర్దస్త్‌ నటులు చివరకు ఆ గొడవకు స్వస్తి చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: