పిఎస్వి గరుడవేగతో చాలా కాలం తర్వాత తన సత్తా చూపిన యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ తన తర్వాత ప్రాజెక్ట్ ను దాదాపు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరు ముగ్గురు దర్శకుల కథలను చర్చిస్తున్న రాజశేఖర్ ఫైనల్ గా అందులో ఒకటి ఓకే చేశారని తెలుస్తుంది. ఇంతకీ రాజశేఖర్ తో సినిమా చేసే దర్శకుడు ఎవరు అంటే ప్రశాంత్ వర్మ అని తెలుస్తుంది. 


రీసెంట్ గా అ! సినిమాతో అందరిని ఆశ్చర్యపరచిన ప్రశాంత్ రాజశేఖర్ కోసం ఓ క్రేజీ స్టోరీ రాసుకున్నాడట. సినిమా కథ కూడా అ! లానే డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా కలిక్ అని పెట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. టైటిల్ చూస్తే కచ్చితంగా మళ్లీ ప్రశాంత్ మంచి సినిమా చేస్తున్నాడని చెప్పొచ్చు.


అ! తో నానిని నిర్మాతగా గెలిపించిన ప్రశాంత్ అసలైతే నాని హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. కాని ఎందుకో అది పట్టాలెక్కలేదు. ఈలోగా రాజశేఖర్ కు కథ వినిపించిన ప్రశాంత్ సినిమా ఓకే చేయించుకున్నాడు. సినిమా కాన్సెప్ట్ మిగతా స్టార్ కాస్ట్ ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.


గరుడవేగ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా మళ్లీ తన మార్క్ చూపించే సినిమా చేసేందుకే రాజశేఖర్ కాస్త వెయిట్ చేశారని తెలుస్తుంది. మరోపక్క రాజమౌళి మల్టీస్టారర్ లో రాజశేఖర్ కూడా ఉన్నారని ప్రచారం జరుగుతుంది అందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: