లాటీవుడ్ ఇండస్ట్రీలోకి నాగ చైతన్య సరసన ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ వరుణ్ తేజ్ తో ‘ముకుంద’ సినిమాలో నటించింది.  ఈ  రెండు సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో మరోసారి బాలీవుడ్ పయనమైంది.  అక్కడ హృతిక్ రోషన్ తో మొహెంజో దారో నటించినప్పటికీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ లో ఏ చాన్స్ లేకుండా పోయింది. దాంతో మళ్లీ తెలుగు లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ సరసన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో చాన్స్ రావడం..అందులో బికినితో కుర్రకారుని రెచ్చగొట్టడంతో పూజా హెగ్డే నక్క తోక తొక్కినట్టయ్యింది.
Image result for హృతిక్ రోషన్, పూజా హెగ్డే
వరుసగా తెలుగులో ఛాన్స్ లు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం యంగ్ హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్ సరసన ఛాన్స్ లు దక్కించుకున్న పూజా హెగ్డే ఈ మద్య సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ లో ఐటమ్ సాంగ్ లో అదరగొట్టింది. ప్రస్తుతం పూజా హెగ్డే కి తెలుగు లో వరుసగా మూడు సినిమాలు ఉన్నాయి.   ఈ మధ్యకాలంలో ఒకేసారి ముగ్గురు అగ్రహీరోల చిత్రాల్లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన అమ్మడు కేవలం పూజానే అని చెప్పవచ్చు. ఇక మోహేన్జదారో చిత్రంతో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ తో కలిసి నటించిన ఈ అమ్మడుకి అక్కడ చేదు అనుభవమే ఎదురయింది.
Image result for POOJA HEGDE BIKINI
కాగా ప్రస్తుతం ఆమెకు మరొక బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. సాజిద్ నడియాద్వాల నిర్మాతగా, సాజిద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, బాబీ డియోల్ హీరోలుగా భారీ బడ్జెట్ మరియు తారాగణంతో రూపొందనున్న హౌస్ ఫుల్ 4 చిత్రంలో పూజ మంచి కీ రోల్ కి ఎంపికయినట్లు తెలుస్తోంది.  కాగా ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, శ్రీవాస్ రూపొందిస్తున్న సాక్ష్యం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: