తెలుగు ఇండస్ట్రీలో రికార్డుల మోత మోగిస్గున్న చిత్రం ‘రంగస్థలం’.  మెగా పవర్ స్టార్ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెంచుతూ వచ్చింది.  ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఇప్పటికే రూ.150 కోట్ల క్లబ్ లో చేరి 200 కోట్ల కలెక్షన్లకు పరుగులు పెడుతుంది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రంగస్థలం దుమ్మురేపుతుండగా..ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపుతుంది.  ఈ చిత్రంలో చిట్టిబాబు గా రాంచరణ్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు.
Related image
రామలక్ష్మి గా సమంత కూడా తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.  ఈ చిత్రంలో రంగమ్మత్తగా యాంకర్ అనసూయ తన నటనకు జీవం పోశారు.  రాంచరణ్, సమంతలకు ఎంతగా పేరు వచ్చిందో..యాంకర్ అనసూయ కు కూడా అంతే పేరు వచ్చింది.  ఈ చిత్రం రెండు వారాల క్రితం విడుదలై సూపర్ హిట్ అయిన 'రంగస్థలం' సినిమాలో లేని రంగమ్మత్తకు సంబంధించిన ఓ సీన్ ను ఆడిషన్స్ లో భాగంగా అనసూయపై చిత్రీకరించగా, తాజాగా ఆ వీడియోను అనసూయ తన అభిమానులతో పంచుకుంది.
Image result for rangasthalam movie
ఈ సినిమాలో అనసూయ పాత్రకు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. పల్లెటూరి మహిళగా అనసూయ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ వీడియోలో పసుపు రంగు చీర, ఎరుపు రంగు జాకెట్ లో కనిపిస్తుండగా, చిట్టిబాబు, రంగమ్మత్త మధ్య జరిగిన ఓ సీన్ ఇది. చిట్టిబాబు కొత్త సిల్క్ బట్టలు ధరించి వస్తే, కొంపదీసి పెళ్లి కుదిరిందా? అని అడగటం, ఆపై ఇంతకీ పిల్లెలా ఉంది? ఈ పాటికి మీ మామయ్య ఉంటేనా తెగ సంతోషపడి పోయుండేవాడు... అయినా నేను లేనా ఏంటి? అన్న డైలాగులు ఉన్నాయి.
Image result for rangasthalam anasuya
ఆడిషన్ లో భాగంగా సీన్ తీసినప్పటికీ, అందులోనూ అనసూయ ఇరగదీసిందని ఈ వీడియో చూసిన అభిమానులు అంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: