టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ సినిమాలంటే యాక్షన్, సెంటిమెంట్ తో అదరగొట్టేలా ఉంటాయి. కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ తో మంచి మెసేజ్ సినిమా తీశారు. ఆ తర్వాత మహష్ కి రెండు భారీ డిజాస్టర్లు వచ్చాయి. మరోసారి కొరటాల కాంబినేషన్లో ‘భరత్ అనే నేను’ సినిమాతో మహేష్ బాబు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. పొలిటికల్ డ్రామాతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ సినిమాలో మహేష్ సీఎంగా బాగా నటించారు. మహేష్ నటనకు టాలీవుడ్ సెలబ్రెటీలు ఫిదా అవుతున్నారు.
సూపర్స్టార్ మహేష్బాబు నటించిన `భరత్ అనే నేను..` సినిమా సృష్టిస్తోన్న కలెక్షన్ల ప్రభంజనానికి టాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. 48 గంటల్లో 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఈ మూవీ.. 175 కోట్ల రూపాయల మైలురాయిని అందుకుంది. సినిమా విడుదలైన ఆరో రోజు కూడా కలెక్షన్ల తుఫాన్ను కురిపిస్తోంది. ఒక్క ప్రేక్షకులే తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా మహేష్ను ఆకాశానికెత్తేస్తోంది. మహేష్ నటన మైండ్ బ్లాక్ చేస్తోంది.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, హీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్లతో పాటు తాజాగా.. విక్టరీ వెంకటేష్ కూడా మహేష్ నటనను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. తన ట్విట్టర్ లో స్పందిస్తూ.. భరత్ అనే నేను చూశాను. మహేశ్బాబు అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. శివ కొరటాల సున్నితమైన కథని అందరూ మెచ్చేలా రూపొందించారు. నిర్మాత దానయ్యతో పాటు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు. మహేష్బాబు ఫొటోను దానికి యాడ్ చేశారు.