తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మెగాహీరోల హవా కొనసాగుతుంది.  గత సంవత్సరం ఖైదీ నెంబర్ 150 చిత్రంతో అద్భుత విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి మొదలు రెండు వారాల క్రితం రిలీజ్ అయిన ‘రంగస్థలం’ వరకు  ఈ హీరోల చిత్రాలు విజయపరంపర కొనసాగిస్తూ వస్తున్నాయి.  ఇక గత సంవత్సరం దువ్వాడ జగన్నాధం హిట్ తో మంచి ఊపు మీద ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా వక్కంతం వంశి దర్శకత్వంలో  ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
Image result for na peru surya na illu
ఈ చిత్రంలో ఓ ఆవేశం ఉన్న సైనికుడి పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడట.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన అందాల భామ  అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.
Related image
ఈ చిత్రానికి సంబంధించిన ఓ కార్యక్రం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో మిలటరీ మాధవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.  ఇటీవలే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు/ ఏ స‌ర్టిఫికేట్ పొందిన ఈ సినిమాను మే 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. కాగా ఏప్రిల్ 29న ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ గ్రాండ్‌గా జ‌ర‌గ‌బోతుంది.  గ‌చ్చిబౌలి స్టేడియంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా అత్య‌థిక మెగాఅభిమానుల స‌మ‌క్షంలో ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ని గ్రాండ్‌గా చేయబోతున్నారు. 
Image result for na peru surya na illu
గతంలో మెగా ఫ్యామిలీలో విషయంలో మనస్పర్ధలు ఉన్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మెగా హీరోల ఫంక్షన్లకు టాప్ హీరోలు విచ్చేయడం కామన్ అయ్యింది.  రీసెంట్ గా రంగస్థలం సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాన్ వచ్చి హంగామా చేశారు.  ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హ‌జ‌ర‌వడయే గాక ఫంక్ష‌న్‌‌లో మ‌రికొన్ని స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ‌స్ కూడా ఉన్నాయని చెబుతోంది చిత్రయూనిట్.  


మరింత సమాచారం తెలుసుకోండి: