విశ్వనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమల్ హాసన్. భారతీయ సీనరంగంలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించారు. నటుడిగా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా ఆయన వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వత సారిక ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి శృతి హాసన్, అక్షర హాసన్ లు జన్మించారు. కొంత కాలం తర్వాత సారికకు దూరమై హీరోయిన్ గౌతమికి దగ్గరయ్యారు.
దాదాపు పదమూడు సంవత్సరాలు వీరు సహజీవనం చేశారు. ఈ మద్య గౌతమి, కమల్ కి మద్య కొన్ని భేదాభిప్రాయాలు రావడంతో వీరు కూడా విడిపోయారు. తాజాగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ లొ శృతిహాసన్ మాట్లాడుతూ..తన జీవితంలో గౌతమి అనే మహిళ లేనేలేదని అన్నారు. కమలహాసన్, గౌతమి విడిపోవడానికి కారణం మీరే అన్న ప్రచారంపై స్పందించాలని కోరగా సమాధానం ఇచ్చింది. తన జీవితంలో లేని ఆవిడ గురించి తాను మాట్లాడదలచు కోవడం లేదని స్పష్టం చేసింది.
మైఖేల్ కోర్సలేతో ఉన్న పరిచయంపై మాట్లాడుతూ, తను స్నేహితుడు మాత్రమేనని, ఆ విషయంపై అంతకన్నా ఏమీ చెప్పలేనని అంది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన తనకు లేదని, రహస్యాలేమీ లేవని, ఏదైనా ఉంటే దాచుకోకుండా వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది.ఇక తండ్రి ఆహ్వానిస్తే రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అవగాహన లేకుండా తాను రాజకీయాల్లోకి వెళ్లబోనని, సమాజానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, రాజకీయ పరిజ్ఞానం పెరిగిన తరువాత ఆలోచిస్తానని వ్యాఖ్యానించింది.
ఇటీవలే 'అర్జున్ రెడ్డి' సినిమాను చూశానని, తనకెంతో నచ్చిన విభిన్నమైన సినిమా అదని చెప్పింది. సినిమా నిర్మాణంతో పాటు సంగీతం, రచన తదితర విషయాలపైనా దృష్టిని సారించానని వెల్లడించింది.