డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ గా ఇండస్ట్రీ రికార్డులను సైతం నెలకొల్పిన సినిమాలను తీసిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫాం కోల్పోయాడని చెప్పొచ్చు. వరుస ఫ్లాపులు పలుకరిస్తున్నా తన ప్రయత్నం మాత్రం తాను చేసుకుంటూ వెళ్తున్నాడు పూరి. ప్రస్తుతం తనయుడు ఆకాష్ తో మెహబూబా సినిమా తీసిన పూరి ఈ సినిమా హిట్ పై నమ్మకంగా ఉన్నాడు.


చాలా రోజుల తర్వాత మనసు పెట్టి చేసిన సినిమా ఇదని చెప్పుకొస్తున్న పూరి ఈ సినిమాతో తప్పకుండా తన రేంజ్ హిట్ కొడతాడని అంటున్నాడు. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన దిల్ రాజు ధైర్యం చేసి మరి సినిమా కొనేశాడు. దిల్ రాజు కొన్నాడంటే సినిమా హిట్ అన్నట్టే అనుకుంటున్నారు.


ఇక ఈ సినిమా ఈవెంట్ లో మాట్లాడిన పూరి తన ఐపాడ్ లో 3 ఏళ్లకు సరిపడా స్క్రిప్టులున్నాయని.. ఆమాటకు వస్తే పదేళ్లకు సరిపడా కథలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పాడు పూరి. ఇక స్టార్ హీరోలు తనని పక్కన పెడుతున్నాడన్న విషయం మీద కూడా స్పందించాడు పూరి. తనతో తీసిన స్టార్ హీరోలకు మంచి పేరే వచ్చిందని.. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా హీరోలకు మాత్రం మంచి క్రేజ్ వచ్చిందని అన్నారు.


మెహబూబా తర్వాత కూడా తనయుడు ఆకాష్ తోనే ఇంకా రెండు సినిమాలు చేస్తాడని అంటున్నారు. మెహబూబా రిజల్ట్ ను బట్టి ఈ సినిమాల అప్డేట్ తెలుస్తుంది. మరి పూరి మనసు పెట్టి చేశాడని చెబుతున్న ఈ మెహబూబా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: