మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ క్రియేట్ చేస్తున్న రికార్డులపై చిరంజీవి వ్యక్త పరిచిన అసంతృప్తి ఇప్పుడు టాపిక్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సుమారు 9 సంవత్సరాల గ్యాప్ తరువాత తిరిగి చిరంజీవి నటంచిన “ఖైదీ నంబర్ 150” సినిమా నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. 100 కోట్ల షేర్ అందుకున్న ఈ మూవీ సాధించిన కలెక్షన్స్ ఒక సంచనలనం అయితే ఈ రికార్డులను ఇటీవల రామ్ చరణ్ “రంగస్థలం” సినిమా సునాయాసంగా బ్రేక్ చేయడంతో చరణ్ స్టామినా పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
యూనివర్సల్ హిట్ అందుకున్న ఈసినిమా కలెక్షన్స్ ఇంకా క్లోజ్ కాకపోయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ పై మెగా స్టార్ చిరంజీవి వ్యక్త పరచిన అభిప్రాయాలు ఇప్పుడ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయం పై చిరంజీవి లేటెస్ట్ గా తన యుఎస్ టూర్ లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘నాన్ బాహుబలి’ రికార్డులు తనకు దక్కాయి అన్న సంతోషాన్ని ఎక్కువసేపు చరణ్ ఉంచలేదు అంటూ జోక్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు మెగా స్టార్.
రికార్డుల కన్నా ఎక్కువ ఆనందం పుత్రోత్సాహంతో ఉంటుంది అని కొందరు ఎన్ఆర్ఐ లు చేసిన కామెంట్స్ స్పందిస్తూ వచ్చే ఏడాది విడుదల కాబోతున్న తన ‘సైరా’ తో చరణ్ ‘రంగస్థలం’ రికార్డులకు సరైన సమాధానం చెపుతాను అంటూ నవ్వుతు కామెంట్ చేసి మరో ట్విస్ట్ ఇచ్చాడు చిరంజీవి. మెగా స్టార్ మాటలను బట్టి చూస్తూ ఉంటే ‘సైరా’ పై మెగా ఫ్యామిలీ పెట్టుకున్న అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే కొంతభాగం షూటింగ్ ఈ సినిమాకు సంబంధించి పూర్తి అయినా వివిధ బాషలలో ఉన్న స్టార్ హీరోస్ ఈమూవీ ప్రాజెక్ట్ లో ఉండటంతో ఈమూవీ షూటింగ్ ను ఒకే ఫ్లోలో షూట్ చేయటం కష్టమవుతోందని దర్శకుడు సురేంద్ర రెడ్డి భావిస్తున్నట్లు టాక్. దీనితో ఈమూవీ వచ్చే సంక్రాంతికి విడుదల చేసే విషయం పై సురేంద్ర రెడ్డికి కూడ స్పష్టమైన క్లారిటీ లేదు అనే వార్తలు కూడ ఉన్నాయి. ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అని ప్రయత్నిస్తున్న ‘సైరా’ కలలు ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి..