సాధారణంగా సినీ రంగంలో జయాపజయాలు ఎప్పుడూ ఉంటాయి. జయం వచ్చినపుడు పొంగిపోవడం…అపజయం ఎదురైనపుడు కుంగిపోవడం లాంటివి చేయడం కెరియర్ కి పెద్ద ఇబ్బంది అవుతుంది. కాకపోతే కొంత మంది హీరో, హీరోయిన్లు పెద్ద విజయం వచ్చినప్పుడు మాత్రం ఆనందం ఉప్పొంగి పోతుంటారు. ఇందుకు పూజాహెగ్డే ఇందుకు భిన్నమేమీ కాదు. ఇండస్ట్రీలోకి ముకుంద, ఒక లైలా కోసం లాంటి సినిమాలు పెద్దగా పేరు తీసుకు రాలేదు. కానీ దువ్వాడజగన్నాధం సినిమా తర్వాత పూజాకు వరుసగా చాన్సులు రావడం మొదలయ్యాయి.
అయితే ఏదైనా అపజయం తనకు వస్తే వెంటనే ఏడుపొచ్చేస్తుంది. పదిహేను నిమిషాలకు పైగా మనస్ఫూర్తిగా దానిని తలచుకుంటూ ఏడ్చేస్తాను అంటూ పూజా చెప్పుకొచ్చింది. ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ప్రతీసారి విజయం వరిస్తుందన్న గ్యారంటీ ఉండదు. విజయాలు వరిస్తేనే ప్రయాణాన్ని కొనసాగిస్తానని అనడం సరికాదు. ఓర్పుతో, ధైర్యంతో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి.
బాలీవుడ్ లో హృతిక్ తో నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో తానెంతో బాధపడినట్లు..చాలా ఏడ్చినట్లు చెప్పింది. దువ్వాడ జగన్నాథమ్ చిత్రం నుంచి ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ఇప్పుడు ఎంచక్కా ఎన్టీఆర్, త్రివిక్రమ్ల కలయికలో రూపొందుతున్న చిత్రంలోనూ, మహేష్బాబు, వంశీ పైడిపల్లి కలయికలో రూపొందే చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.
ఇవి కాకుండా ప్రభాస్, రాధాకృష్ణ (జిల్ ఫేమ్) కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలోనూ, బాలీవుడ్లో హాస్ఫుల్-4 చిత్రంలోనూ పూజ నటించనుంది. మొత్తానికి కెరీర్ బిగినింగ్ లో ఫెయిల్యూర్ల కారణంగా పూజ కాస్త టెన్షన్ పడినా ఇప్పుడు పెద్ద హీరోల సరసన అవకాశాలతో కెరీర్ సాఫీగా సాగిపోతోంది.