టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బాహుబలి’, ‘బాహుబలి2’ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఘనత జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క ఇతర నటులకు కూడా మంచి ఆదరణ అభించడమే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే బాహుబలి 2 తర్వాత దర్శకులు రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకొని త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.
ఇక అనుష్క, రానా లు కూడా ఒక్కో సినిమాలు పూర్తి చేశారు. కానీ ప్రభాస్ మాత్రం బాహబలి 2 తర్వాత ఏ సినిమా కూడా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం తన స్నేహితుడు సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత తన కొత్త చిత్రంలో అడుగుపెట్టబోతున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. గోపీ కృష్ణ మూవీస్లో చాలా విరామం తర్వాత నిర్మాణమవుతున్న చిత్రమిది. పూజా హెగ్డే నాయికగా ఎంపికైంది.
రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా కథాంశం ఉండబోతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇప్పటి వరకు ప్రభాస్ తని ఒక మహాయోధుడిగానే తిలకించారు..డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీస్ తో బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కేవలం నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సంకల్పంతో ఉంది. ఎక్కువ భాగం చిత్రీకరణ యూరప్లో చేయనున్నారు. ప్రభాస్ గత మూడు సినిమాలు ఎక్కువ సమయం తీసుకున్నవే.
బాహుబలి రెండు భాగాలకు ఐదేళ్లు, సాహో కోసం ఏడాదిన్నర పైగా సమయం పడుతోంది. బాహుబలి లాంటి సినిమాలకు ఎక్కువ సమయం తీసుకున్న ప్రభాస్ తన తదుపరి సినిమాలు త్వరగా పూర్తి అయ్యేట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం దుబాయ్లో సాహో పోరాట సన్నివేశాల చిత్రీకరణ కోసం వెళ్లారు ప్రభాస్. అక్కడే దాదాపు నెల రోజులు చిత్రీకరణలో ఉంటారు. జూలై 7 నుంచి రాధాకృష్ణ కుమార్ రూపొందించే సినిమా ప్రారంభం కాబోతోంది.