స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని ఈ సినిమాతో కూడా పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేయడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. వక్కతం వంశీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


యాంగ్రీ సోల్జర్ గా బన్ని.. అదరగొట్టాడని చెప్పొచ్చు. టీజర్, ట్రీలర్ తోనే సినిమా మీద ఓ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన బన్ని సినిమాలో విశ్వరూపం చూపించాడని అంటున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు సహ నిర్మాతలుగా నాగబాబు, బన్ని వాసు ఉన్నారు. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించారు.


ఇక ఈ సినిమా తర్వాత బన్ని ఎవరి డైరక్షన్ లో సినిమా చేస్తాడా అన్న ఆలోచన మొదలైంది. అసలైతే లెక్క ప్రకారం చూస్తే భరత్ సక్సెస్ తో కొరటాల శివ, నా పేరు సూర్య తర్వాత బన్ని ఖాళీ కాబట్టి ఇద్దరు కలిసి సినిమా చేస్తారని ఊహించారు కాని కొరటాల శివతో చర్చలు జరిపాక కూడా విక్రం కె కుమార్ కు ఓకే చెప్పాడట బన్ని.


కొరటాల శివ కథ నచ్చలేదో లేక స్క్రిప్ట్ డెవలప్ మెంట్ కు ఇంకా టైం ఉందని చెప్పాడో కాని విక్రం కుమార్ తో బన్ని ఎన్నాళ్ల నుండో అనుకుంటున్న సినిమా ఇప్పుడు తెరరూపం దాల్చబోతుంది. 24లాంటి ప్రయోగాత్మక సినిమా చేసిన విక్రం కెరియర్ లో ఇష్క్, మనం లాంటి రెండు సక్సెస్ లే ఉన్నాయి. అయినా సరే బన్ని రిస్క్ చేసి మరి విక్రం సినిమా చేస్తున్నాడట. ఈ సినిమాను నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: