అల్లు అర్జున్, వక్కంతం వంశి కాంబినేషన్ లో వస్తున్న ‘నా పేరు సూర్య’ చిత్రం మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఫస్ట్ లుక్, ట్రైలర్ కి మంచి క్రేజ్ లభించింది. ఈ నేపథ్యంలో సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అయితే  ‘నా పేరు సూర్య’  ఉన్న క్రేజ్  దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదవ షో వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈనెల 4వ తేదీ నుంచి ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వడడంతో చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Related image
వాస్తవానికి ఈ మద్య కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సినిమా ప్రత్యేక షోల పై అనుమతి లభిస్తుందా లేదా అన్న మీమాంసలో చిత్ర యూనిట్ పడింది. కానీ 4వ తేదీ నుంచి ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వడడంతో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Image result for naa peru surya
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన నా పేరు సూర్య చిత్రానికి ఎంతటి క్రేజ్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ క్రేజ్ డబుల్ అయ్యింది.
Image result for naa peru surya
మే 4న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ఐదవ ఆటను కూడా ప్రదర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతినివ్వడం నిజంగా ఎంతో సంతోషించాల్సిన విషయం అని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో భాగం అని అన్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మా చిత్ర యూనిట్ తరపును కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: