తెలుగు ఇండస్ట్రీలోకి ‘లక్ష్మీ కళ్యానం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కలువ కళ్ల సుందరి తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ పొజీషన్లోకి వెళ్లింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు పది సంవత్సరాలు దాటినా ఇంకా గ్లామర్ గానే కనిపిస్తు కుర్రాళ్ల మనసు దోచేస్తుంది. 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ చరణ్ తేజతో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ ఇచ్చింది. 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్లో హీరోయిన్ గా మెప్పించింది.
తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు. ఆ మద్య కాజల్ గ్లామర్ కాస్త తగ్గిందని..ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతుందని టాక్ వచ్చింది. కానీ ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో నటిస్తూ తన సత్తా చాటుతూ వస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 చిత్రంతో కాజల్ నటించిన తర్వాత ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ మద్య సినీ తారలు సోషల్ మాద్యామాల ద్వారా తమ అభిమానులతో చిట్ చాట్ చేస్తూ..వారి అభిమానం సంపాదిస్తున్నారు.
తాజాగా కాజల్ అగర్వాల్ 71లక్షల మందికి ఒకేసారి ముద్దు పెట్టేసింది. ఎలా అంటారా....కాజల్ ఇనస్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 7.1 మిలియన్లకు చేరుకుంది. కొంత కాలంగా తనను ఎంతగానో అభిమానిస్తున్న అభిమానులకు ఓకేసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముద్దు పెడుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. దాంతో 71లక్షల మందికి కాజల్ ఒకేసారి ఒకేపోస్ట్ ద్వారా ముద్దుపెట్టినట్టయింది.