టాలీవుడ్ లో ‘సూపర్ ’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ అనుష్క తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. కొత్తలో అనుష్క కేవలం గ్లామర్ ఎక్కువ ప్రాధాన్య ఇచ్చేది..ఎప్పుడైతే అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి సినిమాలు వచ్చాయి..గ్లామర్ కి పూర్తిగా గుడ్ బాయ్ చెప్పి నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తు వస్తుంది. ఇక బాహబలిలో డీ గ్లామర్ గా నటించిన బాహుబలి 2 లో అందాల యువరాణిగా నటించిన అనుష్క తర్వాత ‘భాగమతి’ సినిమాలో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించింది.
టాప్ హీరోలకు వచ్చే కలెక్షన్లు అనుష్క నటించిన ‘భాగమతి’కి వచ్చాయంటే ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. త్వరలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయనుంది అనుష్క. అయితే ఈ అమ్మడు రీసెంట్గా కేదార్నాథ్ వెళ్లింది. కాలి బాట ధామానికి చేరుకొని మహాశివుణ్ణి దర్శించుకుంది. తిరుగు ప్రయాణంలో గుర్రం సహాయంతో 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
అయితే అనుష్క కేదార్నాథ్ దర్శనం చేసుకుంటున్నారన్న విషయం కొద్దిమందికే తెలిసింది. యాత్రలో ఉన్న కొందరు ఆమెను గుర్తించి ఫొటోలు తీసుకున్నారు. అయితే దీనికి ఆమెతో పాటు వచ్చినవారు అభ్యంతరం తెలిపారు.సాధారణ యువతి లాగా అనుష్క అక్కడికి వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే సోషల్ మీడియాలో అనుష్కకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. అనుష్క తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సింపుల్ గా మెయింటైన్ చేస్తుందో దీన్ని బట్టి అర్థం అవుతుంది.