ఈమధ్య కాలంలో సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ మీద యుద్ధం ప్రకటించి ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసిన ఈమె ఇష్యూ పవన్ మీదకు డైవర్ట్ చేసి అది కాస్త వీక్ అయ్యేలా చేసింది. ఇక మీడియా ఛానెల్స్ ఎవరు తనని పిలిచి డిస్కషన్స్ పెట్టట్లేదు.


ఈ క్రమంలో మళ్లీ శ్రీరెడ్డి ఫేస్ బుక్ తోనే ఎటాక్ చేయడం మొదలు పెట్టింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి నిరసనలు తెలిపిన శ్రీరెడ్డి ఇప్పుడు టాలీవుడ్ లో హోమో సెక్సువల్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. కొందరు దర్శకులు వారి దగ్గర పనిచేసే అసిస్టెంట్, ఇంకా చిన్న ఆర్టిస్టులను హోమో సెక్స్ చేస్తున్నారని అన్నది.


సంచలనాల శ్రీరెడ్డి ఏం చెప్పినా ఓ సంచలనమే అలానే ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ఉన్న హోమో రాయుళ్ల మీద తన దృష్టి పెట్టింది అమ్మడు. మరి శ్రీరెడ్డి ఎవరిని ఉద్దేశించి ఈ మెసేజ్ పెట్టిందో తెలియదు కాని ఒక్కసారిగా మళ్లీ ఆమె పెట్టిన మెసేజ్ వైరల్ అయ్యింది. కచ్చితంగా మళ్లీ ఎవర్నో టార్గెట్ చేస్తూ ఈ మెసేజ్ పెట్టిందని కొందరు అంటున్నారు.  


పవన్ మీడియా ఇష్యూ తర్వాత సిని పెద్దల మీటింగ్ అనంతరం మీడియా కూడా కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. దాదాపు వారం పది రోజులుగా శ్రీరెడ్డిని ఏ ఛానెల్ కూడా డిస్కషన్ కు పిలవలేదు. కాస్టింగ్ కౌచ్ మీద మాత్రం సెపరేట్ కమిటీ వేసి పరిష్కార మార్గాలను చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: