టాలీవుడ్ లో ఇండస్ట్రీలో రచయితగా పలు విజయవంతమైన సినిమాలకు పనిచేసిన వక్కంతం వంశీ `నా పేరు సూర్య` సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా తీయాల్సి ఉండగా..అది కొన్నికారణాల వల్ల పెండింగ్ లో పడింది.
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా తీసే చాన్స్ రావడంతో ఆయనకు తగ్గ యాక్షన్ సినిమా తీయాలని భావించారు వంశి. వాస్తవానికి ‘నా పేరు సూర్య’ సినిమా మొదట ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని ఇప్పుడు ఆ సినిమా బన్నీ చేశారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రచయితా ఉన్న తనను దర్శకుడిగా మారాలని ఎన్టీఆర్ ఎంతగానో ప్రోత్సహించారని..దాంతో పూర్తిగా ఎన్టీయార్ను దృష్టిలో పెట్టుకునే ఓ కథ రాశా. అప్పట్లో అది కుదరలేదు. ఆ కథను ఎప్పటికైనా ఎన్టీయార్తోనే చేస్తా. ఆ కథ ఆయనకు మాత్రమే సూట్ అవుతుందని వంశీ అన్నారు.
కాకపోతే `నా పేరు సూర్య` కథ ఎన్టీయార్కు చెప్పలేదు. అది బన్నీ కోసమే రాశాన`ని వక్కంతం వంశీ చెప్పాడు. తాను ఎన్టీఆర్ కి వినిపించిన కథ వేరనీ .. ఆ కథకు .. ఈ కథకు సంబంధం లేదని చెప్పాడు. ఈ సినిమా నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ .. అల్లు అర్జున్ కోసం కథ అడిగినప్పుడు, తన స్టోరీ బ్యాంక్ లో నుంచి ఈ కథను బయటికి తీశానని అన్నాడు. ఎన్టీఆర్ కోసం అనుకున్న కథను సంతృప్తికరంగా తీర్చదిద్దవలసి ఉందనీ, ఆ కథను ఆయనతోనే చేస్తానని చెప్పుకొచ్చాడు.