తెలుగు ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని నటించిన `మజ్ను` చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మానుయేల్. మొదటి చిత్రంతోనే కుర్రకారు మనసు దోచిన ఈ అమ్మడు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో చాన్స్ రావడంతో ఎగిరి గంతేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన `అజ్ఞాతవాసి` పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
తన తదుపరి చిత్రమే స్టార్ హీరో, స్టార్ దర్శకుడితో తన స్టార్ ఇమేజ్ ఎక్కడికో వెళ్తుందని భావించింది అను ఇమ్మానుయేల్. కానీ ఈ అమ్మడి ఆశలన్నీ అడిఆశలే అయ్యాయి..`అజ్ఞాతవాసి` సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఆ సినిమా పరాజయం పాలై నన్ను చాలా నిరాశపరిచింది. అను నటించిన `నా పేరు సూర్య` సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా `అజ్ఞాతవాసి` సినిమా గురించి మాట్లాడింది.
`టాలీవుడ్లోకి వచ్చిన కొత్తలోనే పవన్కల్యాణ్ వంటి హీరోతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావించాను..కానీ సినిమా నన్ను చాలా నిరాశ పరిచిందని..కానీ తనకు గుర్తింపు బాగానే వచ్చిందని అన్నారు. ఆ బాధ ఎక్కువ కాలం లేదు. దానికి కారణం `నా పేరు సూర్య` లాంటి భారీ సినిమాలో అవకాశం రావడమే. ఈ సినిమా ఫలితం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాన`ని అను చెప్పింది.