‘భారత్ అనే నేను’ మూవీతో విపరీతమైన క్రేజ్ మరింత పెంచుకున్న మహేష్ మ్యానియాకు సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. హైదరాబాద్ లోని హైదర్నగర్ లో ఘనంగా జరుగుతున్న ఒక పెళ్లి మండపం బంధువులు సన్నిహితులతో కళకళ లాడుతోంది.
ఈ పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంట కూడా ఫుల్ జోష్ లోఉన్నారు. ఇంతలో ఆ పెళ్లి కూతురికి అనుకోని సర్ప్రైజ్ ఇచ్చే సంఘటన జరిగింది. ఆమెకు ఓపర్సనల్ గ్రీటింగ్ వచ్చిందని ఎవరో తెచ్చి ఇచ్చారు. దాన్ని తీసి చూసి ఆ పెల్లో కూతురు ఆశ్చర్యపోయింది అసలు ఆ విషయం కలా నిజమా అనుకుని కాసేపు నమ్మకలేకపోయింది అని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఆ గ్రీటింగ్ ప్రత్యేకత ఏమిటంటే గ్రీటింగ్ కార్డును పంపింది హీరో మహేష్ బాబు. ఈ గ్రీటింగ్ కార్డులో మహేష్తో పాటు భార్య నమ్రత కూడా సంతకం చేసింది. ఇలా ప్రత్యేకంగా ఆ పెళ్లి కూతురు సులేఖ కు మహేష్ ప్రత్యేకమైన గిఫ్ట్ పంపడం వెనుక ఒక ఆసక్తికర విషయం ఉంది మహేష్బాబుకు సులేఖ తన వీరాభిమాని అని మహేష్ తన పీ ఆర్ టీం ద్వారా తెలుసుకుని మహేష్ ఆమెకు పెళ్లిలో ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకొని ఇలా ప్లాన్ చేసాడట.
ఇప్పుడు ఈగ్రీటింగ్ తో పాటు పెళ్లి కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో మహేష్ అభిమానుల మధ్య వైరల్ గా మారాయి. నిజంగా సీఎం భరత్ ఇచ్చిన సర్ప్రైజ్ సూపర్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.ఇచ్చిన మాట కోసం ఎంత దూరం అయినా వెళ్ళే ముఖయంత్రి ‘భరత్’ పాత్రను పోషించిన మహేష్ ఇలా తన అభిమానుల కోసం ఏకంగా వారు పెళ్లి చేసుకుంటున్న పెళ్ళి మండపాల వైపుకు మహేష్ వస్తున్న నేపధ్యంలో మహేష్ మ్యానియా మరింత పెరిగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..