నిజానికి వక్కంతం వంశీ ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సింది. వక్కంతం వంశీ కూడా ఎన్టీఆర్ కోసం చాలా రోజులు వేచి చూసాడు. అయితే స్టోరీ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరలేదు. దీనితో ఎన్టీఆర్ వక్కంతం వంశీ కి నో చెప్పేశాడు. ఆవెంటనే వక్కంతం వంశీ బన్నీ తో కమిట్ అయిపోయి నా పేరు సూర్య సినిమా తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ రావడం తో అల్లు అర్జున్ ఆత్మ రక్షణలో పడిపోయాడు. ఈ సినిమా వదులుకొని ఎన్టీఆర్ మంచి పనే చేసాడని ఇండస్ట్రీలో, ఇటు అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ సినిమా చూసిన వారికి ఎన్టీఆర్ ఇంతకుముందు చేసిన 'టెంపర్' ఛాయలున్నాయనిపిస్తోంది. టెంపర్ కథ రాసింది కూడా వక్కంతం వంశీనే. ఆ కథతోనే దర్శకుడు అవుదామని అనుకున్నాడు కానీ ఎన్టీఆర్ కోరడంతో కథ పూరీకి ఇచ్చేసాడు. ఆ స్థానంలో రాసిన 'నా పేరు సూర్య' కథ కూడా అదే మీటర్లో రాసినట్టున్నాడు. సహజంగానే అది ఎన్టీఆర్ని ఎక్సయిట్ చేయలేదు. అతను డ్రాప్ అయిపోవడంతో అల్లు అర్జున్కి ఇలాంటి పాత్ర కొత్త కనుక చేసేసాడు.
అతని మీదే డివైడ్ టాక్తో ఓపెన్ అయిన ఈ చిత్రం ఎన్టీఆర్కి అయితే మరింత బ్యాడ్ టాక్ వచ్చేదేమో. మళ్లీ టెంపరే వేరేలా చేసారని అనేవారేమో. మొత్తానికి తారక్ ఈ చిత్రం విషయంలో కరక్ట్గానే ఆలోచించాడు. కాకపోతే దీనికి బదులుగా చేసిన 'జై లవకుశ' కూడా పెద్దగా ఆడలేదనుకోండి. అది వేరే విషయం. అయితే అస్సలు ఈ స్టోరీ ఎన్టీఆర్ కు వినిపించలేదని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు .