సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని మంచి సక్సెస్ బాటలో నడుస్తుంది. రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘రంగస్థలం’ సినిమాలో చిట్టి బాబు పాత్రకు మంచి ప్రజాదరణ లభించింది. అంతే కాదు సెలబ్రెటీలు సైతం రాంచరణ్ నటనకు ఫిదా అయ్యారు. ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి లాభాలు గడించింది. ‘ధృవ’ సక్సెస్ తర్వాత వెంటనే మరో మంచి సక్సెస్ అందుకున్న రాంచరణ్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Related image
ఈ సినిమాకు సంబంధించి పూజాకార్యక్రమాలు ఎప్పుడో జరిగిపోయాయి. అంతే కాదు ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు బోయపాటి .   'రంగస్థలం' సినిమా షూటింగులో చరణ్ బిజీగా ఉండటం వలన, ఇతర పాత్రలకి సంబంధించిన సన్నివేశాలను ప్లాన్ చేసుకుని ఫస్టు షెడ్యూల్ ను బోయపాటి పూర్తి చేశాడు. ఇక రెండవ షెడ్యూల్లో చరణ్ .. హీరోయిన్ కైరా అద్వాని పాల్గొంటారనే వార్తలు వచ్చాయి.
Image result for boyapati ram charam
కాకపోతే రెండవ షెడ్యూల్ ఇంకా ప్రారంభం కాలేదు సరికదా ఆ షెడ్యూన్ ని మూడు సార్లు వాయిదా వేస్తూ వచ్చారు. అంతే కాదు షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన కైరా అద్వాని కూడా వెనుతిరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. 
Image result for boyapati ram charam
ఇందుకు కారణం స్క్రిప్ట్ విషయంలో చరణ్ చెప్పిన మార్పులు .. చేర్పులు కారణమని సమాచారం. 'రంగస్థలం' సక్సెస్ స్థాయిని నిలబెట్టుకోవడం కోసం చరణ్ చెప్పిన మార్పుల కారణంగానే షూటింగు ఆలస్యమవుతోందట. ఈ విషయంలో చరణ్ ను బోయపాటి మెప్పిస్తే .. రెండవ షెడ్యూల్ మొదలైపోతుందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: