ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలోల ఇట్టే వైరల్ అవుతుంది. తాజాగా మోడలింగ్ నుంచి నటిగా మారిన నివేదా పేతురాజ్ కి సంబంధించిన కోన్ని బికీనీ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.  నివేదా పేతురాజ్.. తొలి చిత్రం ‘ఒరు నాల్ కూతు’తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరవాత ఉదయనిధి స్టాలిన్ సరసన ‘పొదువుగ ఎన్ మనసు తంగమ్’ అనే సినిమాలో నటించింది. తెలుగులో శ్రీవిష్ణు ‘మెంటల్ మదిలో’ కూడా నివేదానే హీరోయిన్. ప్రస్తుతం జయం రవి హీరోగా తెరకెక్కిన ‘టిక్:టిక్:టిక్’ సినిమాలోనూ కీలకపాత్ర పోషించింది.
Image result for nivetha pethuraj
లేత నీలం రంగు బికినీలో హాట్ హాట్‌గా ఉన్న నివేదా ఫొటోలను చూసి కొంత మంది అభిమానులు పండగ చేసుకున్నారు. అయితే తమిళనాడు సంప్రదాలయను గౌరవించేవారు మాత్రం నివేదాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో తమిళ ఇండస్ట్రీలో ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు తీవ్ర దుమారం రేపాయి.  వాస్తవానికి ఈ ఫోటోలు నివేదా పేతురాజ్ వి కావట.అచ్చం ఆమెను పోలి ఉన్న వర్షిణి పాకల్ అనే మోడల్ ఫొటోలట. ప్రముఖ ఫొటోగ్రాఫర్ ప్రశూన్ ప్రశాంత్ ఈ ఫొటోలను తీశారు. అంతేకాకుండా ఆయన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇవి నివేదా పేతురాజ్ ఫొటోలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే ఇలాంటి సంఘటన ఈ అమ్మడికి కొత్తేమే కాదట. గత సంవత్సరం కోలీవుడ్ లో సుచీలీక్స్ వివాదంలో కూడా అప్పుడు నివేదా చిక్కుకుంది. నివేదా పేతురాజ్ న్యూడ్ వీడియో అంటూ అప్పుడు ఒక వీడియో హల్‌చల్ చేసింది. అయితే అది నివేదా వీడియో కాదని తరవాత తేలింది. ఇప్పుడు మళ్లీ ఈ బికినీ ఫొటోలు ఫేక్ అని తేలాయి. కాగా, నివేదా తాజా చిత్రం ‘టిక్:టిక్:టిక్’ జూన్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: