టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో పూరి జగన్నాధ్ ‘పోకిరి’ లాంటి సూపర్ హిట్ ఇచ్చి ప్రభంజనం సృష్టించారు.  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది..అంతే కాదు మహేష్ బాబు స్టార్ ఇమేజ్ కూడా ఒక్కసారే పెరిగిపోయింది.  ఆ తర్వాత మహేష్ - పూరి కాంబినేషన్ లో వచ్చిన ‘బిజినెస్ మెన్’ సినిమా కూడా మరో ఘన విజయం సాధించింది.
Image result for pokiri movie
మాఫీయా నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో మహేష్ బాబు ని కొత్తరకంగా చూపించి మంచి హైలెట్ చేశారు పూరి.  ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఆ సినిమా పెండింగ్ లో పడిపోయింది.  ప్రస్తుతం పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా ‘మెహబూబా’ సినిమా తీశారు.  మంచి లవ్ స్టోరితో పాటు..దేశ భక్తి కూడా ఈ సినిమాలో ఉందట.
Related image
ఇప్పటి వరకు పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి క్రేజ్ వచ్చింది.    మే 11న రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పూరి..మహేష్ బాబుతో చేయవల్సిన జనగణమన ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు.  ఈ అంశంపై పూరి మాట్లాడుతూ..బిజినెస్ మెన్ సినిమా తరువాత జనగణమన ప్లాన్ చేశా.
Image result for puri jaganad mahabuba
మహేష్ కి కథ కూడా వినిపించా..కానీ మహేష్ తన అభిప్రాయం చెప్పలేదు. ఈ సినిమాను మహేష్ చేసినా చేయకపోయినా ఆపలేను..వీరే హీరోతో అయినా ఖచ్చితంగా తీస్తానని చెప్పారు. కథ విషయానికి వస్తే..ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, మహిళలపై అకృత్యాలు అరికట్టడానికి ఓ యువకుడు చేసిన పోరాటం ఎలాంటి ఫలితం  తెలియజేప్పే  సినిమానే జనగణమన అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: