ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని సినీప్రముఖులపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఫేస్ బుక్ ద్వారా ఎదో ఒక సంచలనాన్ని సృష్టిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె వైసీపీ ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేస్తూ ఫేసుబుక్లో పోస్ట్ చేసింది.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా, అప్పట్లో హీరో రాజశేఖర్ మరియు ఆయన భార్యపై వచ్చిన ఆరోపణల గురించి స్పందిస్తూ వాటిని ఖండించిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ తో మూడు సినిమాల్లో నటించానని తెలిపిన ఆమె, రాజశేఖర్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నాళ్లవుతోంది? మరి ఆయన నిజంగా తప్పుచేస్తే ఇప్పటికీ తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించింది.


ఇక ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా శ్రీరెడ్డి రాసుకొస్తూ- రోజాగారు ఫుల్ కవరింగులు బాగానే ఇస్తుందని ఆమె ఆరోపించింది.  ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదా అని ప్రశ్నించింది. రోజా ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్ళు అయ్యిందట. అయినా కూడా ఆమెని ఎవరూ ఇంత వరకు గెలకలేదట. మీరు ఎవరికీ నచ్చలేదేమో కొంపదీసి ? నాతో వద్దమ్మా నీలొల్లి అంటూ ఘాటు వాఖ్యలు చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: