సినీ ఇండస్ట్రీలో పడకసుఖం అందిస్తేనే నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు అవకాశాలు ఇస్తారు అని సంచలన వాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డి, కాస్టింగ్ కౌచ్ ను నిర్మూలించాలని మరియు తెలుగు అమ్మాయిలకు సినిమాల్లో అవకాశాలు కల్పించాలని పెద్ద ఉద్యమాన్నే చేసింది. అయితే కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆమె ఉద్యమం నీరుగారిపోయింది.


ఇక అప్పటి నుండి బయట కనిపించడం, న్యూస్ స్టూడియోలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేసిన ఆమె సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు సంచలన పోస్టులు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే రోజాను తిట్టిపోసుకున్న ఆమె తాజాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలపై అనుచిత పోస్టు చేసింది.


తాజాగా ఫేసుబుక్లో పోస్ట్ పెట్టిన ఆమె- పొట్టివంకాయ అరవింద్ అంకుల్, బిజినెస్ కి భజన అంబాసిడర్ సునీల్ (నాన్ లోకల్), సురేష్ మామ, దిల్ లేని డొల్ల రాజు అంటూ ప్రముఖ నిర్మాతలను అపహాస్యం చేస్తూ రాసుకొచ్చింది. అంతేగాక వీరు నలుగురు నియంతలు అని పేర్కొంది. మహేష్ బాబు కుటుంబం ఈ నియంతల లిస్టులో లేదు. కృష్ణ గారు దేవుడంటూ రాసుకొచ్చింది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: