రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సావిత్రి జీవిత కథ ‘మహానటి’ మూవీ పై చివరి నిముషంలో భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈమూవీకి సంబంధించిన స్టిల్స్ కు విపరీతమైన క్రేజ్ రావడంతో ‘మహానటి’ కి చాల సులువుగా భారీ ఓపెనింగ్స్ వస్తాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈసినిమాకు సంబంధించి చివరిలో వచ్చే 8 నిముషాల క్లైమాక్స్ సీన్స్ ఈసినిమాకు అత్యంత కీలకం అని అంటున్నారు. ఈమూవీ క్లైమాక్స్ లో వచ్చే ‘చివరకు మిగిలింది’ అన్న బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కు సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేశ్ చూపించిన హావభావాలు అందరి హృదయాలను కదిలిస్తాయని అంటున్నారు. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీ క్లైమాక్స్ చూసిన ఎవరైనా సరే ఆ ‘మహానటి’ జీవితంలో కోల్పోయిన విషయాలను గుర్తుకు వచ్చి కన్నీరు పెట్టుకోవడం ఖాయం అని అంటున్నారు. ఈసినిమాలో జర్నలిస్ట్ పాత్రను పోషించిన సమంత ఈసినిమాకు డబ్బింగ్ చెపుతూ ఈమూవీ చివరిలో వచ్చే ఆ 8 నిముషాల క్లైమాక్స్ ను చూసి తన కంట కన్నీరు ఆపుకోలేకపోయానని చెపుతోంది. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా ఈసినిమా ప్రమోషన్ విషయంలో ఈమూవీ నిర్మాతలు అనుసరించిన స్వీట్ మ్యాజిక్ చాలామందిని ఆశ్చర్య పరిచింది. ‘మహానటి’ సావిత్రికి జీడిపప్పు పాకం (క్యాజు స్వీట్) అంటే చాల ఇష్టం అయిన నేపధ్యంలో ఇండస్ట్రీలోని ప్రముఖులకు అదేవిధంగా మీడియా జర్నలిస్టులకు సావిత్రిని గుర్తుకు చేస్తూ ఈమూవీ నిర్మాతలు పంపిన క్యాజు స్వీట్ బాక్స్ లను చూసి తెగ ఆనంద పడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ విడుదలకు ముందే నిర్మాతలు స్వీట్ తినిపించారు కాబట్టి ఈమూవీ రిజల్ట్ కూడ  స్వీట్ గానే ఉంటుందని ఆశిద్దాం..
 


మరింత సమాచారం తెలుసుకోండి: