శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ జనతా గ్యారేజ్, రంగస్థలం హిట్లతో సూపర్ ఫాంలో ఉన్నారు. హ్యాట్రిక్ హిట్లు సాధించిన ఈ నిర్మాణ సంస్థ రానున్న రోజుల్లో కూడా క్రేజీ కాంబినేషన్స్ ను సెట్ చేసే పనిలో పడ్డది. ఇప్పటికే నాగ చైతన్య, చందు మొండేటి కాంబోలో సవ్యసాచి రిలీజ్ కు రెడీ అవుతుండగా.. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో అమర్ అక్బర్ ఆంటోని చేస్తున్నారు. 


ఇక ఇదే కాకుండా సూపర్ స్టార్ మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా కన్ఫాం చేసుకున్నారు. 1 నేనొక్కడినే తర్వాత సుకుమార్ మహేష్ తో చేస్తున్న సినిమా ఇదే. భారీ అంచనాలతో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా నిరాశ పరచింది. అప్పుడే మహేష్ కు కచ్చితంగా హిట్ ఇవ్వాలని చెప్పాడు సుకుమార్.


రంగస్థలం హిట్ తో కెరియర్ లో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న సుక్కు మహేష్ కు కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కాబట్టి కచ్చితంగా ఆ ప్రాజెక్ట్ భారీ తనంతో ఉంటుందని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ శ్రీమంతుడుతో నిర్మాతలుగా మారారు.


నవీన్, రవిశంకర్, సివి.మోహన్ ముగ్గురు కలిసి ప్రొడ్యూసర్స్ గా మైత్రి బ్రాండ్ ను కొనసాగిస్తున్నారు. మరి మైత్రి బ్రాండ్ ఇలానే సూపర్ హిట్లతో కంటిన్యూ అవుతుందా లేదా అన్నది చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: