ఒకప్పుడు టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ్ - నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ సెన్సేషన్ క్రియేట్ చేసింది..ఈ సినిమాతో  తర్వాత టాలీవుడ్ లో ఎన్నో మాఫియా తరహా సినిమాలు విడుదల అయ్యాయి.  ఆ తర్వాత వర్మ, నాగార్జున, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ‘గోవింద గోవింద’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  చాలా కాలం తర్వాత మరోసారి వర్మ-నాగార్జున కాంబినేషన్ లో ‘ఆఫీసర్’ సినిమా వస్తుంది.  ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి క్రేజ్ వచ్చింది.
Image result for nagarjuna office movie stills
ఈ నేపథ్యంలో  మే 4న విడుద‌లైన సెకండ్ టీజ‌ర్‌ రిలీజ్ చేశారు వర్మ.  కాగా, టీజ‌ర్‌కి లైకుల‌తో స‌మానంగా డిజ్‌లైక్‌లు రావ‌డంతో వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యాడు.  వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఎవరిపైనా కామెంట్లు చేయకుండా మౌనంగా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మరోసారి తన సోషల్ మీడియా  సంచలన కామెంట్స్ పెట్టారు.
Image result for nagarjuna office movie stills
ఆఫీస‌ర్ టీజర్‌ని 11వేల మంది డిజ్‌లైక్ కొట్టారు. అంటే 11 కోట్ల మంది తెలుగు ప్ర‌జ‌ల‌లో ప‌వ‌న్‌కి ఉన్న ఫ్యాన్స్ కేవ‌లం 11వేలేనా.  నాగార్జున‌- ఆఫీస‌ర్ త‌ర‌పున పీకే ఫ్యాన్స్‌కి ఇదే నా వార్నింగ్‌. జ‌న‌సేన పార్టీకి స‌పోర్ట్ చేసే వారు కేవ‌లం 11వేల మంది ఉన్నార‌నే విష‌యంపై సీరియ‌స్‌గా ఆలోచించాలి.
Image result for nagarjuna ram gopal varma
లేదంటే ప్ర‌జారాజ్యం పార్టీలా ఇది కూడా డిజాస్ట‌ర్ అవుతుంది అని వ‌ర్మ పేర్కొన్నాడు. కాగా, నాగార్జున కొత్త సినిమా టీజర్ కు వేల సంఖ్యలో డిస్ లైక్స్ వస్తున్నాయని, అవన్నీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నారన్న ప్రచారం సాగుతున్న వేళ, వర్మ ఈ విధంగా పంచ్ వేశారన్నమాట!



మరింత సమాచారం తెలుసుకోండి: