‘పోకిరి’ సినిమాతో మహేష్ ను సూపర్ స్టార్ గా మార్చిన పూరి జగన్నాథ్ ఆతరువాత మహేష్ తో ‘బిజినెస్ మేన్’ సినిమాను తీసి విజయాన్ని కూడ అందుకున్నాడు. అయితే  ఆతరువాత పూరి ఎంత ప్రయత్నం చేసినా మహేష్ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. గత కొంత కాలంగా పూరి తీస్తున్న సినిమాలు అన్ని పరాజయం చెందడంతో టాప్ హీరోలు ఎవ్వరు పూరి వంక చూడకపోవడంతో పూరీ ఇక లాభం లేదనుకుని తన కొడుకు ఆకాష్ ను హీరోగా తన సర్వశక్తులు ధారపోసి ‘మెహబూబా’ సినిమాను తీసాడు. 
సంబంధిత చిత్రం
ఈవారం విడుదల కాబోతున్న ఈసినిమా నిర్మాణం కోసం పూరి తాను ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న విలాసవంతమైన తన ఇంటిని కూడ అమ్ముకున్నట్లు గాసిప్పులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో తన దర్శకత్వ ప్రతిభ పై చాలామంది హీరోలకు అనుమానాలు ఏర్పడిన నేపధ్యంలో పూరి ఈ ‘మెహబూబా’ మూవీకోసం తన మొదటి సినిమాకు కష్టపడినట్లు గా కష్టపడ్డాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
ఈనేపధ్యంలో ఈమూవీని ప్రమోట్ చేస్తూ పూరి తన డ్రీమ్ మూవీ ప్రాజెక్ట్ ‘జన గణ మన’ గురించి ప్రస్తావించాడు. ఈమూవీని ఎలాగైనా తీయడం తన ధ్యేయం అని చెపుతూ ఈసినిమా ప్రాజెక్ట్ గురించి మహేష్ తో మరొకసారి చర్చించబోతున్నట్లు లీకులు ఇచ్చాడు పూరి. ఈమూవీ కథకు ప్రస్తుతం మహిళల పై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన అంశాలు కూడ జోడించానని ఇప్పుడు ఈమూవీ కథ చాల పవర్ ఫుల్ గా వచ్చింది అని అంటున్నాడు పూరి. 
MAHESH BABU LATEST PHOTOS IN BHARATH ANE NENU కోసం చిత్ర ఫలితం
ఇదే ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ ఒకవేళ మహేష్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోకపోయినా ఈమూవీ తీయడం ఆగదనీ ఇంతవరకు తాను మహేష్ గురించి సహనంతో చూసిన వెయిటింగ్ చాలు అంటూ జోక్ చేసాడు పూరి. అంతేకాదు ఒకవేళ మహేష్ తన వద్ద డేట్స్ లేవు అని చెపితే తాను మరొక హీరోతో ఈమూవీని వచ్చే ఏడాది పట్టాలు ఎక్కించడం ఖాయం అని అంటున్నాడు. దీనినిబట్టి చూస్తుంటే పూరి మహేష్ కు ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్లే అనిపిస్తోంది. అయితే పూరి మాటలను మహేష్ ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటారు అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: