ఈరోజు విడుదలవుతున్న ‘మహానటి’ మూవీ అనుకోకుండా టాప్ హీరోలు మహేష్ చరణ్ బన్నీల మార్గాన్ని అనుసరించడం హాట్ న్యూస్ గా మారింది. ఈ సమ్మర్ రేస్ కు వచ్చిన ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ ‘నాపేరు సూర్య’ సినిమాలు అన్నీ దరిదాపు మూడు గంటల నిడివితో ఉన్నా ఆసినిమాలను ప్రేక్షకులు ఎటువంటి అసహనం వ్యక్త పరచకుండా చూడటంతో తెలుగు ప్రేక్షకులు పెద్ద సినిమాలకు అలవాటు పడిపోయారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  
MAHANATI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ఇదే పద్ధతిని ‘మహానటి’ కూడ అనుసరిస్తోంది. ఈమూవీ నిడివి 2 గంటల 56 నిమిషాలు ఉండటంతో ఇంత ఎక్కువసేపు ఏమ్యాజిక్ చేసి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రేక్షకులను ఈమూవీ ధియేటర్లలో కూర్చో పెట్టగలడు అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా ఉంది. వాస్తవానికి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈమూవీ కోసం వ్రాసుకున్న స్క్రిప్ట్  అనుకున్న ప్రకారం తీస్తే ఈమూవీ నిడివి ఐదు గంటలు వస్తుందట. 
MAHANATI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే నాగ్ అశ్విన్ ఎన్నో చర్చలు చేసి ఈస్క్రిప్ట్ కు ఎన్నోమార్పులు చేసినా ఈమూవీ నిడివిని ఏమాత్రం తగ్గించలేక పోవడంతో దాదాపు మూడు గంటల  సినిమాగా ‘మహానటి’ మారింది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈరోజు విడుదల అవుతున్న ‘మహానటి’ మూవీని తన మెగాఅభిమానులను కూడ చూడమని చిరంజీవి పిలుపు ఇస్తూ ఒక వీడియో విడుదల చేయడంతో ‘మహానటి’ అందరి హీరోల మూవీగా మారిపోయింది. 
MAHANATI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
చిరంజీవి కెరియర్ కు పునాది వేసిన ‘పునాదిరాళ్ళు’ మూవీలో ‘మహానటి’ సావిత్రితో కలిసి నటించిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు కార్చగలిగే ఉత్తమనటి సావిత్రి అంటూ ఆమెతో తాను నటించిన మధుర క్షణాలను గుర్తుకు చేసుకున్నాడు చిరంజీవి. ఈమూవీకి ఇలా అందరి ప్రశంసలు లభిస్తున్న నేపధ్యంలో ఈమూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ దుమ్ము దులపడం ఖాయం అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: